Hyd Pubs: పబ్బు గబ్బు.. అర్ధరాత్రి దాటితే అశ్లీలమే!
గ్రేటర్ హైదరాబాద్ లో పబ్ ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది.
- By Balu J Published Date - 03:14 PM, Sat - 4 June 22
గ్రేటర్ హైదరాబాద్ లో పబ్ ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్స్.. న్యూడ్ డాన్స్ సైతం ప్రేరేపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటితే ఢిల్లీ, ముంబై నుంచి డాన్సర్లు రప్పించి అర్ధనగ్నంగా డాన్సులు చేయిస్తున్నాయి. అంతేకాదు.. సీక్రెట్ రూం సైతం ఏర్పాటుచేసి విచ్చలవిడిగా ప్రవరిస్తున్నాయి. డీజేల హోరు కుర్రకారును ఆకర్షిస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. అమాయక యువత ఎంజాయ్ మెంట్ మాయలో పబ్ లకు ఇట్టే ఆకర్షితమవుతున్నాయి. సినిమా వ్యామోహమో.. ఇతర కారణాలో కానీ వీకెండ్స్ వస్తే ఫుల్ గా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాయి. దీంతో పబ్ లు కూడా యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తున్నాయి. మందు, విందు, పొందు అనేలా వ్యవహరాలు కొనసాగిస్తున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కు అలవాటు పడ్డ యువత తాగుడు మైకంలో చేయకూడని పనులు చేస్తున్నారు. పబ్బులపై డ్రగ్స్ తదితర ఆరోపణలు రావడంతో నిర్వాహకులు కొత్త ప్లాన్ వేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకుని వచ్చి పొట్టి దస్తులు వేసి అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. పబ్బులకు వచ్చే వారిని జేబులను ఖాళీ చేయడమే టార్గెట్గా చేసుకుని యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు.
పబ్బుల్లో డ్రగ్స్ కూడా దొరుకుతాయ్. పబ్బుకి వెళ్ళేవాళ్ళలో నూటికి తొంభై మందికి ఈ విషయం తెలుసు. ఏ పబ్బు ఎంతవరకు అదనపు సమయం నడుస్తుందో అందరికీ తెలుసు. కానీ, పబ్బులు అర్థ రాత్రి దాటాక కూడా నడుస్తున్నా, పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా పోలీసులు అటువైపుగా ఎందుకు చూడటంలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ కోణాలు బయటకొస్తున్నాయ్.. దాని చుట్టూ మళ్ళీ లోతైన విచారణలూ జరుగుతున్నాయి. అయినా ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మాదాపూర్కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు శుక్రవారం రాత్రి కూకట్పల్లిలోని క్లబ్ మస్తీ పబ్పై దాడి చేసి నిబంధనలను ఉల్లంఘించినందుకు తొమ్మిది మంది డ్యాన్సర్లు, మేనేజర్ ప్రదీప్ కుమార్, DJ ఆపరేటర్ ధనరాజ్ మరియు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో, డ్యాన్సర్లు సెమీ న్యూడ్ డ్రెస్లలో డ్యాన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. SOT స్లీత్స్ వారిని KPHB పోలీసులకు అప్పగించారు. క్లబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, నిర్వాహకులు విష్ణు, కృష్ణ పరారీలో ఉన్నారు. క్లబ్ మస్తీ పబ్లో బార్ అండ్ రెస్టారెంట్ నడిపేందుకు మాత్రమే శివప్రసాద్ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్, బేగంపేట, బంజారాహిల్స్, మాదాపూర్ లోని కొన్ని పబ్ లు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు జూబ్లీహిల్స్ పబ్ మైనర్ రేప్ ఘటనపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. టీనేజీ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తెలంగాణ పోలీసులు బాలనేరస్థులైన మరో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ రేప్ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. సదుద్దీన్ మాలిక్ అనే నిందితుడిని నిన్న అరెస్టు చేశారు. మే 28న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పార్టీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Tags
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.