KTR Counter Bandi: బీజేపీ బాబులు.. ఈ లవంగాన్ని ఇలాగే వదిలేయకండి!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీబీజేపీ అధినేత బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- By Balu J Published Date - 03:06 PM, Sun - 9 October 22
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీబీజేపీ అధినేత బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫాం హౌజ్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కేటీఆర్ తన ట్విటర్ లో “బీజేపీ బాబులూ.. ఈ ‘లవంగం’ వదలొద్దు.. త్వరలో పిచ్చి పట్టిన తర్వాత ప్రజలను తిడతాడంటూ ట్వీట్ చేశాడు. బండి సంజయ్ మాటలు సమాజానికి ప్రమాదకరం అని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ను వెంటనే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించాలని బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ కోరారు. అటు బండి కామెంట్స్, ఇటు కేటీఆర్ కౌంటర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.
పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు
ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి https://t.co/bCucYw6PM6
— KTR (@KTRTRS) October 8, 2022
Related News
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.