KTR@UK: కేటీఆర్ కు యూకే ఆహ్వానం.. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో స్పీచ్!
మంత్రి హోదాలో ఇప్పటికే ఎన్నో ప్రపంచ వేదికల మీద ప్రసంగాలు చేశారు కేటీఆర్.
- By Balu J Published Date - 11:33 AM, Thu - 6 April 23
తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు మరో ఆహ్వానం అందింది. మంత్రి హోదాలో ఇప్పటికే ఎన్నో ప్రపంచ వేదికల మీద ప్రసంగాలు చేశారాయన. ఈ నేపథ్యంలో తాజాగా మే 11, 12 తేదీల్లో లండన్లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సు లో పాల్గొనేందకు ఆహ్వానం అందింది. సదస్సులో మాట్లాడాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావును గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ ఆహ్వానించింది.
‘‘మీ మాటలు, ప్రయత్నాలు ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతుందని మేం భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఆర్థిక పురోగతిని ప్రదర్శించడానికి మేం ప్రత్యేకించి ఆసక్తిగా ఉన్నాం” అని గ్లోబల్ సంస్థ తెలిపింది. హౌస్ ఆఫ్ కామన్స్లో సీమా మల్హోత్రా MP (లేబర్), UK క్యాబినెట్ మంత్రితో బ్లాక్-టై సెలబ్రేషన్ డిన్నర్ని ప్రధాన వక్తగా నిర్వహించే విందుకు హాజరు కావాల్సిందిగా ఆర్థిక, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ KTRకి ఆహ్వానం పంపింది. యునైటెడ్ కింగ్డమ్ అంతటా జరగనున్న భారత వారోత్సవాల ప్రారంభోత్సవం కానున్నాయి. బహుళ వ్యాపార, మీడియా, రాజకీయ నాయకులతో సహా 800 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
విదేశీ విద్యను అభ్యసించిన కేటీఆర్ కు సమకాలీన అంశాలపై మంచి పట్టుంది. వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన ఆనర్గళంగా మాట్లాడగలరు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే కేటీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. వర్తమాన అంశాలపై స్పందించే కేటీఆర్ తీరుకు వివిధ అంతర్జాతీయ సంస్థలు ఫిదా అయ్యాయి. ఐటీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న కేటీఆర్ కు యూకే లాంటి సంస్థలు ఆహ్వానం పలుకుతుంటాయి.
Also Read: Telangana Record: పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్
Tags
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �