KTR: యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్
- By Balu J Published Date - 08:17 PM, Sat - 27 January 24
KTR: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన పలు లోక్ సభ నియోజకవర్గాలపై ఫోకస్ చేసి గెలుపు వ్యూహాలపై ద్రుష్టిసారిస్తున్నారు. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయంబర్స్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తాం అని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకంతో ఆటో డ్రైవర్ల సమస్యలు పెరిగిపోయాయి. దాంతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని కేటీఆర్ వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ వారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం కింద వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు.. ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకుని, వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు కమిటీ వేశారు. మరోవైపు ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మాజీ మంత్రి హరీశ్ రావు సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో వారి సమస్యలను లెవనెత్తుతామని అన్నారు.
Related News
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.