HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcrs Downfall Has Begun Declares Amit Shah At Telangana Rally

Amit Shah Attacks KCR: కేసీఆర్ సర్కార్ పతనానికి ఇదే ఆరంభం : అమిత్ షా

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి బోతున్నారని బీజేపీ అగ్ర నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

  • Author : Naresh Kumar Date : 21-08-2022 - 9:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah
Amit Shah

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి బోతున్నారని బీజేపీ అగ్ర నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని చెప్పారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం… మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు సంక్షేమ పథకాలు తెలంగాణ రైతాంగానికి అందకుండా చేసి పాపానికి పాలుపడుతున్నారనీ ఆరోపించారు. తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్ 2014 నుంచి మూతపడిందనీ, కేసీఆర్ కుటుంబానికి అయితే రిక్రూట్‌మెంట్ ఓపెన్ ఉందన్నారు.అయితే తెలంగాణ యువతకు మాత్రం రిక్రూట్‌మెంట్ లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమన్న ఆయన తన ప్రభుత్వం ఏర్పడితే దళిత/షెడ్యూల్డ్ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.
దళిత సోదరులు మళ్లీ ఈ అవినీతిపరుల ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సహకరిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ రావచ్చు గానీ ఏ దళిత వ్యక్తిని సీఎం కానివ్వరనీ అమిత్ షా అన్నారు. తన ప్రసంగంలో అమిత్ షా మజ్లిస్ , కేసీఆర్ దోస్తీ పైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం వమ్ము చేసిందనీ, మజ్లిస్ భయంతో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. మోదీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామనీ అమిత్ షా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి జోస్యం పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.

https://twitter.com/AmitShah/status/1561362869153038337

 

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎం లాంటిదని అమిత్ షా చురకలు వేశారు. తెలంగాణలోనే అధిక ధరలు వున్నాయని.. పెట్రో ధరలు ఎక్కువని, పన్నులు కూడా తగ్గించలేదని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రెండు సార్లు పెట్రో ధర తగ్గించిందని.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అమిత్ షా చురకలు వేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా వుంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్ సంధించిన ప్రశ్నలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు.

 

Live from Public Meeting from Munugode. https://t.co/4v9YxZZKuB

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 21, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • kcr
  • Munugode
  • Telangana BJP
  • telangana politics
  • telangana rally

Related News

KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

    BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd