KCR to avoid PM: ఈసారి కూడా కలిసేది లేదు…ప్రధాని టూర్కు కేసీఆర్ డుమ్మా..?
రాష్ట్ర సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం...ఈ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో ముగింపులేనట్లు కనిపిస్తోంది.
- By Hashtag U Published Date - 12:11 AM, Wed - 25 May 22
రాష్ట్ర సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం…ఈ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో ముగింపులేనట్లు కనిపిస్తోంది. ఎడమొహం పెడ మొహం అన్నట్లుగా రెండు ప్రభుత్వాలు ఉండటంతో…వీటి మధ్య మరింత దూరం పెరుగుతోంది. ఈ నెల 26వ తేదీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలుకుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
ప్రధాని హోదాలో మోదీ గతంలో హైదారబాద్ పర్యటనకు వచ్చారు. అప్పుడు కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలకలేదు. కేసీఆర్ డుమ్మా కొట్టడంపై రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ముచ్చింతల్ లో సమతామూర్తివిగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి కేసీఆర్ కనీస మార్యదకూడా ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ఈనెల 26న గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి ప్రధాని ముఖ్యఅతిథిగా రానున్నారు.
అయితే అదే కేసీఆర్ బెంగుళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవగౌడతోపాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండోసారి కూడా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని అధికారుల్లో చర్చ జరుగుతుంది. ఈ పర్యటన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరింత వైరం పెరిగే అవకాశం ఉండే అవకాశం లేకపోలేదు.
కాగా రాష్ట్రానికి అప్పులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనే సీఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మోదీ టూర్ కు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై మోదీకి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. మొత్తానికి మే 26న కేసీఆర్ హైదరాబాద్ లో ఉంటారా? బెంగుళూరు వెళ్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Related News
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో �