CM KCR Skip: దీదీ భేటీపై ‘కేసీఆర్’ సందిగ్ధం!
రాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
- By Balu J Published Date - 11:44 AM, Tue - 14 June 22
రాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 15న ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీయేతర పార్టీల సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హాజరవుతారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు గైర్హాజరైతే చంద్రశేఖర్ రావు సమావేశానికి హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముందస్తు హామీల కారణంగా కేటీఆర్ హాజరుకాని పక్షంలో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ల పేర్లను ఈ సమావేశానికి హాజరయ్యేలా పరిశీలిస్తున్నారు.
మమతాబెనర్జీ శనివారం చంద్రశేఖర్ రావుతో పాటు 21 మంది బిజెపియేతర పార్టీల నాయకులను సమావేశానికి ఆహ్వానిస్తూ లేఖ రాయడమే కాకుండా, అదే రోజు ఆయనతో ఫోన్లో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి హాజరుకావాలా వద్దా అనే విషయంపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ వర్గాల ప్రకారం, బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని సమావేశానికి ఆహ్వానించిన తర్వాత కేసీఆర్ సందిగ్ధంలో పడిపోయాడు.
కేసీఆర్ కాంగ్రెస్తో స్టేజీ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని వర్గాలు తెలిపాయి. బెనర్జీ ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ప్రకటించలేదు. శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆ రోజు అయోధ్యలో ఉండడంతో సమావేశానికి హాజరుకావడం లేదని వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా సమావేశానికి దూరంగా ఉండటం తప్పుడు సంకేతం ఇచ్చినట్టవుతుంది కాబట్టి, పార్టీ సీనియర్ నాయకుడిని సమావేశానికి డిప్యూట్ చేయాలని యోచిస్తోంది.
Related News
Delhi : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఎన్ బ్లాక్లో బ్యాగు కలకలం
Delhi: ఢిల్లీలోని ఐకానిక్ కన్నాట్ ప్లేస్లోని ఎన్ బ్లాక్లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు కనుగొనబడింది. కన్నాట్ప్లేస్ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు. ఘటనా స�