KA Paul Meet With CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన KA పాల్
- Author : Sudheer
Date : 25-12-2023 - 1:46 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిశారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాను కలిసినట్లు కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తాను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు వెళ్లానని, జనవరి 30న ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానించానని, శాంతి సదస్సుకు వస్తానని సీఎం చెప్పారని కేఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా సీఎంను ఆయన కోరారు. అలాగే ఈ ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. పలు దేశాల నుంచి వేల మంది ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు పాల్ వెల్లడించారు.
Read Also : Pooja Hegde : అలా డిసైడ్ అయిన పూజా హెగ్దే.. కెరీర్ లో ఫస్ట్ టైం..!