IT Raids : హైదరాబాద్లో ఐటీ రైడ్స్.. ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు
IT Raids : హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి.
- By Pasha Published Date - 10:02 AM, Tue - 9 January 24
IT Raids : హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారుల సోదాలు మొదలయ్యాయి. రాయదుర్గం, కోకాపేట, మొయినాబాద్ ప్రాంతాలలోని ఫార్మా కంపెనీల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సిటీలోని మొత్తం తొమ్మిది చోట్ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని సమాచారం. మొయినాబాద్లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. శ్రీ హరి హోమ్స్ రవీంద్ర అగర్వాల్, చందర్ రాజ రెడ్డి, ప్రకాష్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
పలు టీమ్లుగా విడిపోయిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలను(IT Raids) మొదలుపెట్టారు. ఒక ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని గ్లాండ్ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు రైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రతినిధి రాజు, ఝాన్సీ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
Also Read: 911 Call: ఇండియా అంటే మాకు ‘911 కాల్’.. మాజీ రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు
సీఎం సన్నిహితుడి సంస్థలోనూ రైడ్స్
డిసెంబరు మూడోవారంలోనే నాలుగు రోజుల పాటు విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన కడప షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్లో ఐటీ సోదాలు జరిగాయి. ఇతడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడని కొన్ని మీడియాలలో కథనాలు వచ్చాయి. కడప శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు కర్మాగారంలో సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల బందోబస్తు మధ్య ఐటీ సోదాలు నిర్వహించారు. కడప ద్వారకానగర్లో విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడైన చిన్నపిల్లల వైద్యుడు కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూడా నాలుగు రోజులు ఐటీ సోదాలు జరిగాయి. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేస్తున్నారు. కంపెనీ విద్యుత్ స్మార్టు మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల విడి భాగాలు కొనుగోలు చేసే సమయంలో, తర్వాత అమ్మకాలు చేసిన సమయంలో ఆదాయపన్నుశాఖకు చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లించలేదనే ఆరోపణలు వచ్చాయి దీంతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్తో పాటు ప్రొద్దుటూరులో..
గత నెల (డిసెంబరు) 21న హైదరాబాద్తో పాటు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేసీ పుల్లయ్య అనే వ్యక్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారు. కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు కూడా కేసీ సంస్థే చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ అధికారుల సోదాలు చేశారు. ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీశారు.
Related News
Hyderabad: హైదరాబాద్లోని చట్నీస్ హోటల్పై ఐటీ దాడులు
చట్నీస్ కు ఐటీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని పలు చట్నీస్ హోటల్స్, మేఘనా ఫుడ్స్ వంటి ప్రముఖ ఆహార సంస్థలను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు.