Hyderabad: యాజమాన్యం వేధింపుల వల్ల విద్యార్థి బలవన్మరణం
హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా 16 ఏళ్ళ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. యువరాలలోకి వెళితే..
- By Praveen Aluthuru Published Date - 04:48 PM, Tue - 31 October 23
Hyderabad: హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా 16 ఏళ్ళ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. వివరాలలోకి వెళితే..
హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు . చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి (16) కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించాడు. ఈ కాలేజీలో మరెవరూ చేరకూడదని లేఖలో పేర్కొన్నాడు. క్షమించండి అమ్మా నాన్న అంటూ లేఖలో రాసుకొచ్చాడు.
తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపవద్దని కుటుంబ సభ్యులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Hyderabad: యాజమాన్యం వేధింపుల వల్ల విద్యార్థి బలవన్మరణం
Related News
BJP MLA Grandson Suicide: బీజేపీ ఎమ్మెల్యే మనవడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖిల్చిపూర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హజారీలాల్ డాంగీ మనవడు విజయ్ డాంగి ఆత్మహత్య చేసుకున్నాడు. లా చదువుతున్న అతడు రెండు పేజీల సూసైడ్ నోట్ని పోలీసులు గుర్తించారు.