Telangana BJP: సర్వేల్లో ‘టీ బీజేపీ’ జోష్
బండి సంజయ్ కుమార్ సారధ్యంలో తెలంగాణా లో పుంజుకుంటున్న బీజేపీ.... ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే నిదర్శనం.. ఆ సంస్థ సర్వే నివేదిక ప్రకారం..
- By Hashtag U Published Date - 05:41 PM, Fri - 21 January 22
బండి సంజయ్ కుమార్ సారధ్యంలో తెలంగాణా లో పుంజుకుంటున్న బీజేపీ…. ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే నిదర్శనం.. ఆ సంస్థ సర్వే నివేదిక ప్రకారం..
ఇప్పటికిప్పుడు తెలంగాణ లో ఎన్నికలు జరిగితే.. బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు గెలుపొందుతుంది.. 2019 లో తెలంగాణ లో నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే…
కాంగ్రెస్ గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలుపొందగా.. తాజాగా ఎన్నికలు జరిగితే రెండు స్థానాలకే పరిమితం..
టీ.ఆర్.ఎస్ + మజ్లిస్ కూటమి గత ఎన్నికల్లో 10 సీట్లలో గెలుపొందగా… ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒక స్థానం కోల్పోనుంది.
ఇండియా టుడే ప్రతి ఏడాది చేసే ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేస్తుంది. దాని ప్రకారం.. తెలంగాణ లో బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కి ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి.
Related News
Telangana BJP : తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిటా.. సాధ్యమేనా..?
దేశ వ్యాప్తంగా ఎన్నికల జాతర జరుగుతోంది. మరోమారు అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఊవిళ్లూరుతోంది.