BRS Lose: ఆ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇస్తే.. 14 సీట్లు ఓడిపోవడం పక్కా!
అసెంబ్లీ ఎన్నికల గడవుకు చాలా రోజులున్నప్పటికీ ఇప్పట్నుంచే ఆశావాహులు వివిధ ప్రకటనలు చేస్తూ చర్చనీయాంశగా మారుతున్నారు.
- By Balu J Published Date - 12:34 PM, Thu - 25 May 23
మూడోసారి తెలంగాణలోకి అధికార పీఠాన్ని కైవసం చేసుకొని, తద్వారా జాతీయ రాజకీయల్లో చక్రం తిప్పాలని బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే, అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వ్యవహరిస్తూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల గడవుకు చాలా రోజులున్నప్పటికీ ఇప్పట్నుంచే ఆశావాహులు వివిధ ప్రకటనలు చేస్తూ చర్చనీయాంశగా మారుతున్నారు.
ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు (MLA’s) పార్టీ అధిష్టానం టిక్కెట్లు ఇస్తే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 అసెంబ్లీ స్థానాలను కోల్పోనుండటం ఖాయమని తెలుస్తోంది. ఈ ప్రకటన చేసింది కాంగ్రెస్, బీజేపీ నేతలు కాదు.. బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి. కేసీఆర్ కేబినెట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, మాజీ రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ పట్నం మహేందర్రెడ్డి ఈ బహిరంగ ప్రకటన చేయడంతో బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేగడంతో పాటు బీఆర్ఎస్లోని అంతర్గత పోరు బట్టబయలైంది.
పట్నం మహేందర్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుని రవాణా శాఖ మంత్రిగా నియమించారు. 2018 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన పూర్తి కాలం మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోవడం షాకింగ్ గా మారింది. 2019 జూన్లో రోహిత్ రెడ్డి మరో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లోకి ఫిరాయించడం అతనికి మరింత షాకింగ్. దీంతో తాండూరు నియోజకవర్గంలో పట్నం, రోహిత్రెడ్డి మధ్య రాజకీయ పోరు మొదలైంది.
పట్నం మహేందర్ రెడ్డి (Mahendar Reddy) 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేస్తానని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రోహిత్ రెడ్డికి టిక్కెట్ రాదని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్టు ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇందుకు భిన్నంగా గత నెలరోజులుగా కేసీఆర్ చేపట్టిన పలు సర్వేల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవరని కేసీఆర్ తేల్చిచెప్పారని పట్నం బుధవారం బాంబు పేల్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించగా, టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారు.
Also Read: workouts: వర్కవుట్స్ చేయకుండానే ఫిట్ గా ఉండొచ్చు.. ఎలాగో తెలుసా!
Related News
BRS: బీఆర్ఎస్కు షాక్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి రాజీనామా
Former MLA Beti Subhash Reddy: లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి( Beti Subhash Reddy), బీఆర్ఎస్కు రాజీనామా(resignation)చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్ధతు ఇస్తున్నట్లు లేఖలో పేర