Rahul Telangana Tour : రాహుల్ పర్యటనలో ‘చంచల్ గూడ’ షెడ్యూల్
చంచల్ గూడ జైలులో రిమాండ్ మీద ఉన్న ఎన్ఎస్ యూఐ లీడర్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు.
- By CS Rao Published Date - 04:35 PM, Mon - 2 May 22
చంచల్ గూడ జైలులో రిమాండ్ మీద ఉన్న ఎన్ఎస్ యూఐ లీడర్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్ కూడా జైలర్ను కలిసి విద్యార్థులతో సమావేశానికి అనుమతి కోరారు. జైలులో ఉన్న కాంగ్రెస్ యువ లీడర్లను కలిసిన తరువాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్శిటీకి రాకుండా రాహుల్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు . హైదరాబాద్ పర్యటన సందర్భంగా జైలులో ఉన్న విద్యార్థులతో రాహుల్ సమావేశం అవుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాహుల్ పర్యటనతో టీఆర్ఎస్ ప్రభుత్వం భయాందోళనకు గురవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
We have given representation to the superintendent of Chanchalguda Jail seeking permission for
@RahulGandhi ji to visit our illegally arrested @TSNSUI president & other important leaders.TRS Government is in a state of panic with Rahul ji’s visit to the state. pic.twitter.com/3xSgLF3FV8
— Revanth Reddy (@revanth_anumula) May 2, 2022
యూనివర్సిటీలోకి రాహుల్ అనుమతిని కోరుతూ మంత్రుల నివాసం ఎదుట ఆందోళనకు దిగిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులను జైల్లో పెట్టారు. జైలులో ఉన్న విద్యార్థులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం చంచల్గూడ జైలులో రిమాండ్కు గురైన ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) ఎన్ఎస్యూఐ కార్యకర్తలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజీ ముందు బైఠాయించారు. సోమవారం ఉదయం నిరసన ప్రదర్శన అనంతరం NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్తో పాటు మరో 17 మంది విద్యార్థులను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చట్టవిరుద్ధంగా గుమిగూడడం, దాడి చేయడం, అల్లర్లు చేయడం, అతిక్రమించడం మరియు ప్రభుత్వ ఉద్యోగులను వారి విధులను నిర్వర్తించకుండా నిరోధించడం వంటి నేరాలకు వారిపై కేసు నమోదు చేశారు.
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.