Crime News : సిద్దిపేటలో దారుణం.. బతుకమ్మ ఆడుతున్న భార్యను హత్య చేసి..!
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హత్యల సంఖ్య పెరిగిపోతుంది. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియక నిండు ప్రాణాలను బలి చేస్తున్నారు.
- By Hashtag U Published Date - 12:27 PM, Mon - 26 September 22
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హత్యల సంఖ్య పెరిగిపోతుంది. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియక నిండు ప్రాణాలను బలి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు వలన హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుందంటూ బతుకమ్మ ఆడుతున్న భార్యను భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. సిద్దిపేట జిల్లా వీరాపూర్లో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి-ఎల్లమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురుని అదే గ్రామానికి చెందిన ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వివిధ కారణాలతో పెళ్లి అయిన నెల రోజులకే మంగ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో రెండో కుమార్తె స్వప్నను ఎల్లారెడ్డికే ఇచ్చి రెండో పెళ్లి చేశారు. ఎల్లారెడ్డి- స్వప్న దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 6 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి కాపురం ఉన్నట్టు ఉండి గొడవలు, మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయితే స్వప్న పెళ్లి కాకముందు నుంచే వీరాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. విషయం తెలిసిన ఎల్లారెడ్డి భార్య స్వప్నను పలుమార్లు మందలించాడు. తాజాగా ఇదే విషయమై ఆమెతో గొడవపడి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి స్వప్న తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా ఎల్లారెడ్డి అక్కడికి చేరుకొని భార్యను దారుణంగా హత్య చేశాడు. తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్ను బతుకమ్మ ఆడుతున్న భార్య తలపై బలంగా కొట్టడంతో స్వప్న అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు స్వప్న తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాఉ. నిందితుడు ఎల్లారెడ్డి పరారీలో ఉన్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
Lok Sabha 2024: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 106 మందిపై సస్పెన్షన్ వేటు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి హాజరైన 106 ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కారణంగా వారిపై చర్యలు తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదానికి ప్రభుత్వ ఉద్యోగులు బలయ్యారు.