Telangana Flood Relief Fund : వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్కు భారీ విరాళాలు..
Telangana Flood Relief Fund : ముఖ్యమంత్రి సహాయనిధికి (CM Relief Fund) రూ.20లక్షల విరాళాన్ని టెక్నో పెయింట్స్ వారు అందజేశారు
- By Sudheer Published Date - 09:34 PM, Wed - 18 September 24

Huge Donations to CMRF for Flood Victims : తెలంగాణలో భారీ వర్షాలు, వరదల (Heavy Rains and Floods) వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. పలుచోట్ల ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో వరద బాధితుల కోసం తమ వంతు సాయం అందజేసేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చి వివరాల చెక్ లను అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి (CM Relief Fund) రూ.20లక్షల విరాళాన్ని టెక్నో పెయింట్స్ వారు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ చెక్ ను అందజేశారు. అలాగే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనార్స్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించింది. ALEAP అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి గారు, ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గా భవాని గారు, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి గారు MSME పాలసీ -2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు.
నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర శరణి ,ఈడీ పునీత్ లు వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.5 కోట్ల చెక్కు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ వై.శోభ వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల చెక్కు ను అందజేశారు. శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైఎస్ చక్రవర్తి రూ. 25 లక్షలు, Moldtek Industries వైస్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ కోటి రూపాయిల చెక్ ను అందజేశారు.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ ఒక కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి గారు, జేఎండీ శ్రీనివాసరావు గారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కెఆర్ సీ శేఖర్ గారు, బిజినెస్ యూనిట్ హెడ్ ప్రవీణ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ వీవీఎన్ రెడ్డి… pic.twitter.com/3CrwYIyK7t
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్ లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. కాలేజీ డైరెక్టర్ జి.రామేశ్వర రావు గారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం అందజేశారు. #Telangana… pic.twitter.com/iZHumebS8D
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
వరద బాధితుల సహాయార్థం మోల్డ్ టెక్ ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందజేశారు. మోల్డ్ టెక్ వైఎస్-ప్రెసిడెంట్ జె. రాణా ప్రతాప్ గారు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం… pic.twitter.com/XCaFkLuFwW
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేసింది. బ్యాంకు చైర్మన్ వై.శోభ గారు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు… pic.twitter.com/xwQgGvQLeY
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి నారాయణ విద్యా సంస్థల తరఫున 2.5 కోట్ల రూపాయల విరాళం అందజేశారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పొంగూరు సింధూర, పొంగూరు శరణి, ప్రసిడెంట్ కె. పునీత్ తదితరులు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును… pic.twitter.com/BTjilKf6C0
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనార్స్ ఆఫ్ ఇండియా #ALEAP ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించింది. #ALEAP అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి గారు, ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గా భవాని గారు, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి గారు #MSME పాలసీ -2024 ఆవిష్కరణ కార్యక్రమంలో… pic.twitter.com/xk6txTkQGI
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
వరద బాధితుల సహయార్థం టెక్నో పెయింట్స్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. టెక్నో పెయింట్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అకూరి శ్రీనివాసరెడ్డి, వైస్-చైర్మన్ సీవీఎల్ఎన్ మూర్తి, సీఈవో అనిల్ .కె తదితరులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ.… pic.twitter.com/nLsbSmRie2
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2024
Read Also : Asaduddin Owaisi : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయి