HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Gutha Sukender Reddy Said Federalist Conspiracy Against Telangana

Gutha Sukender Reddy: తెలంగాణ రాష్ట్రంపై సమైఖ్యవాదుల కుట్ర.. గుత్తా కామెంట్స్!

టీఆర్ఎస్ నేత, నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • By Balu J Published Date - 03:13 PM, Fri - 2 December 22
  • daily-hunt
Gutta
Gutta

టీఆర్ఎస్ నేత, నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడారు.  సంవత్సరకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం కోసం జాతీయ పార్టీల కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ గవర్నర్ వ్యవహార శైలి, బి‌జే‌పి దత్త పుత్రిక షర్మిలా పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర, ED,CBI దాడులు, MLA ల కొనుగోలు వ్యవహారాలన్నీ సమైక్య వాదుల కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికే విఘాతం కలిగిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ ప్రజానీకం మేలుకోవాల్సిన  సమయం వచ్చిందని ఆయన అన్నారు. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అరాచక సంఘటలను, హత్యాలను, తుపాకుల మోతను, రక్తం ఏరులై పారినా బాంబుల మోతను, రౌడీల రాజ్యాన్ని, భూ కబ్జాలు, అనేక ఘటనలను భరించామని అన్నారు. పోరాడి తెచ్చుకున్నా తెలంగాణ రాష్ట్రoలో  అలాంటి సంఘటనలు పునారావృత్తం కాకుండ, మత విద్వేషాలను తిప్పికొట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

KCR, ఆయన కుటుంబాన్ని రాజకీయముగా అడ్డు తొలగించుకుంటే,  తెలంగాణాను ఆక్రమించుకోవచ్చునని సమైక్య వాదులు కుట్రలు చేస్తున్నారని గుత్తా అన్నాడు. 2014లో బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మండలాలను ,సిలేరు పవర్ ప్రాజెక్టు ను ఏపీ రాష్ట్రములో కలిపి తెలంగాణ రాష్టానికి తీరని అన్యాయం చేసిందని, ఆ రోజు నుండి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవితి ప్రేమ చూపిస్తోంది అని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలననే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని సీనియర్ నాయకుడు గుత్తా వ్యాఖ్యనించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gutha sukender reddy
  • Nalgonda district
  • shocking comments
  • TRS leader

Related News

    Latest News

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd