Nallamala: నల్లమలను కమ్మేసిన పొగమంచు, శ్రీశైలం రహదారిపై జరభద్రం!
- Author : Balu J
Date : 26-12-2023 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
Nallamala: రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాలమూరు వ్యాప్తంగా విపరీతమైన పొగమంచు ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు దృష్టి మసకబారుతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున 12 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. చలికాలం గరిష్టంగా ఉండటంతో నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీశైలం హైవే వెంబడి ఉన్న అచ్చంపేట, నల్లమల్ల అటవీ ప్రాంతాలు, తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు స్పష్టంగా చూడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అచ్చంపేట నివాసి రవీందర్ ప్రకారం “ఉదయం 5 నుండి 7 గంటల వరకు తెల్లటి పొగమంచు మొత్తం ప్రాంతాన్ని కప్పి ఉంటుంది. సూర్యరశ్మి వెలువడిన తరువాత పొగ మసకబారుతుంది. అయినప్పటికీ, గత రెండు రోజులుగా ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు కూడా భారీ పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో దృష్టి మసకబారినందున తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నారు.
“వాహనాలు నెమ్మదిగా వెళ్లడం వల్ల శ్రీశైలం హైవే మొత్తం ట్రాఫిక్ నిండిపోతుంది. అచ్చంపేట నుండి శ్రీశైలం వరకు వెళ్లే చాలా వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు 12 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చల్లని వాతావరణ పరిస్థితులకు దారితీస్తోంది. ఇప్పటికే చలిగాలుల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పొగమంచు వల్ల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని రవీందర్ తెలిపారు.
Also Read: Walking: నడకే మనిషికి మంచి ఆరోగ్యం