Whats Today : వరల్డ్ కప్లో పాకిస్థాన్కు చావో రేవో.. కేసీఆర్ సుడిగాలి పర్యటన
Whats Today : వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ చావో రేవో తేల్చుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది.
- By Pasha Published Date - 08:19 AM, Fri - 27 October 23
Whats Today : వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ చావో రేవో తేల్చుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్లో పాక్ తాడోపేడో తేల్చుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోతే పాక్ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్ చేరకుండా ప్రపంచకప్లో దాని పోరాటం ముగుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యువ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని(Whats Today) ప్రసంగిస్తారు.
- ఇవాళ మహబూబాబాద్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. ఈసందర్భంగా గులాబీ బాస్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బీఆర్ఎస్లోకి చేరనున్నారు.
- ఇవాళ వర్ధన్నపేటలో జరిగే బహిరంగ సభలోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు మహబూబాబాద్ నుంచి నేరుగా వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ చేరుకుంటారు.
- నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ 3వ రోజు బస్సుయాత్ర కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించనున్నారు.
- వైఎస్సార్సీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర రెండో రోజైన ఇవాళ గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో జరగనుంది. ఈరోజు తిరుపతిలో ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
Also Read: Russia – Hamas – Iran : బందీలను ఇరాన్కు అప్పగిస్తామని ప్రకటించిన హమాస్
Related News
Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం