కొంపెల్ల మాధవీ లత కోఠిలోని మహిళా కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. ప్రస్తుతం విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ కూడా ఆమెదే. మాధవీ లత లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ప్రసిద్ధి. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఎన్ఎసీసీ క్యాడెట్గా, క్లాసికల్ మ్యూజికల్ సింగర్గా సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేతలు రెండు,మూడుసార్లు రెండో స్థానంలో నిలిచారు కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
Also Read : ISPL 2024: మార్చి 6 నుంచి ఐఎస్పీఎల్ ప్రారంభం
2004 సంవత్సరం నుంచి..
2004 సంవత్సరం నుంచి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అసదుద్దీన్ కు ముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి 2004 వరకు రెండు దశాబ్దాలపాటు పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ లెక్కన హైదరాబాద్ పార్లమెంటు సీటు.. 1984 నుంచి నాలుగు దశాబ్దాలుగా ఒవైసీల అడ్డా. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేత వినోద్ తావడే, అర్జున్ పాండేతో కలిసి పలు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. శుక్రవారం రోజే బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ పేరు కూడా లోక్సభ అభ్యర్థుల లిస్టులో ఉంది. ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లపై బీజేపీ మరోసారి నమ్మకం ఉంచింది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు అదే స్థానం నుంచి బరిలో నిలుపుతోంది బీజేపీ.