HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Conspiracy To Hand Agri Sector To Corporates Telanganas Kcr Slams Bjp

CM KCR: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర: సీఎం కేసీఆర్!!

తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్లే తెలంగాణలో స‌మృద్ధిగా పంటలు పండాయని సీఎం కేసీఆర్ అన్నారు.

  • Author : Hashtag U Date : 12-04-2022 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్లే తెలంగాణలో స‌మృద్ధిగా పంటలు పండాయని సీఎం కేసీఆర్ అన్నారు. తమ చర్యల వల్లే కోటి ఎకరాల పంట విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. అందుకే పంటలు బాగా పండుతున్నాయన్నారు. అయితే కేంద్రంలో పూర్తిస్థాయిలో రైతు వ్యతిరేక సర్కార్ ఉందని..ఇది భారత రైతాంగ దుర‌దృష్ట‌మ‌న్నారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగిందన్నారు. చివరికి దిగివచ్చిన కేంద్రం…ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు.

ఇంత దరిద్రపు గొట్టు, దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘట్టాలన్నింటికీ దేశ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని తెలిపారు. అదంతా ఓ చరిత్రగా చెప్పారు. ఉద్యమాలు చేస్తున్న సమయంలో రైతులను మోదీ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని..ఉగ్రవాదులుగా అభివర్ణించారని కేసీఆర్ మండిపడ్డారు.

దేశంలోని వ్యవసాయరంగాన్ని మొత్తం కూడా కార్పొరేటర్లకు అప్పగించాలన్న ఓ బలమైన కుట్ర జరుగుతోందని..ఆ కుట్ర కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని…దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తోందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చించిందని..అయినా దానిని అమలు చేయరని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వీటన్నింటితోపాటు ఎరువుల ధరలు కూడా పెంచారని ఫైర్ అయ్యారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో తమకు అవసరమైన బిల్లులను పాస్ చేయించున్నారో తప్పా…రైతులకు అవసరమైన వాటిని మాత్రం పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • conspiracy to sell agri sector
  • corporrate sector
  • Telangana CM slams BJP

Related News

    Latest News

    • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

    • 2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!

    • టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

    Trending News

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd