KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!
- By Balu J Published Date - 02:05 PM, Sat - 27 January 24
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం అని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లే. కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని తిట్టి…. అధికారంలోకి రాగానే దావోస్లో వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బిజెపి కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేలా పనిచేసింది. బిజెపి ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజకీయ నేపథ్యం అని మన పార్టీ అభ్యర్థులను తిరస్కరించింది… కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం ను మాత్రం నా మినిట్ చేసింది’’ అని కేటీఆర్ అన్నారు.
‘‘రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రా అని తిరుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ చొడో అని వదిలి వెళుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ని వదిలి వెళుతున్నాయి. ఆ కూటమిలో మిగిలేది చివరికి రాహుల్ గాంధీ ఒక్కరే. ఢిల్లీలో మోడీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదు. బిజెపిని ఎదుర్కొనే శక్తి లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే చేతులెత్తేసింది. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్ లోనితీష్ కుమార్, పంజాబ్లో ఆమ్ ఆర్మీ పార్టీ మాదిరే తెలంగాణలో కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలి. మోడీ అపేది ముమ్మాటికీ బలంగా ఉన్న ప్రాంతీయ లీడర్లే అనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ అన్నారు.
‘‘బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, వంటి బిజెపి లీడర్లను ఓడించింది కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్ అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపించ గలిగేది గులాబీ పార్టీ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ వంటి పార్టీలకు వేయాలి. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర మంది అర్హులైన మహిళలకు రెండున్నర వేల రూపాయల మహాలక్ష్మిని పార్లమెంటు ఎన్నికలకు ముందే అందించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Related News
Hyderbad: బాబా ఫసియుద్దిన్ పై పోలీసులకు ఫిర్యాదు
Hyderbad: బీఅర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ విసిరింది బాబా ఫసియుద్దిన్ అంటూ బోరబండ పోలీసులకు బీ అర్ ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. బోర బండ లో ఈనెల 9 న ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ దాడి ఘటన జరిగిందని, కార్పొరేటర్ బాబా ఫసియుద్దున్ తదితరుల మీద చర్యలు తీసుకోవాలి అని బోర బండ పోలీసులతో పాటు నగర పోలీస్ కమిషనర్ కు బీ అర్ ఎస్ నాయకుల […]