Harish Rao : సీఎం రేవంత్ వచ్చి మోతీలాల్తో మాట్లాడాలి: హరీశ్రావు
నిరుద్యోగుల కోసం మోతీలాల్ నాయక్ ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
- By Pasha Published Date - 02:52 PM, Sun - 30 June 24
![Harish Rao : సీఎం రేవంత్ వచ్చి మోతీలాల్తో మాట్లాడాలి: హరీశ్రావు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Harish-Rao.jpg)
Harish Rao : నిరుద్యోగుల కోసం మోతీలాల్ నాయక్ ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మాట్లాడాలని కోరారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చలు జరిపి, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ను పరామర్శించిన సందర్భంగా హరీశ్ రావు(Harish Rao) పైకామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
దీక్ష విరమించాలని మోతీలాల్ను ఈసందర్భంగా హరీశ్ రావు కోరారు. సీఎం రేవంత్ ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నించగానే కక్షపూరిత కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను మోసగించడం, వేధించడం ఆపేయాలన్నారు. హైదరాబాద్ అశోక్నగర్లో నిరుద్యోగులను కలిసి హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ.. తెలంగాణ నిరుద్యోగుల నిరసన దీక్షపై ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ సహా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Israel Vs Hezbollah : హిజ్బుల్లాతో యుద్ధానికి ఇజ్రాయెల్ సై.. వాట్స్ నెక్ట్స్ ?
నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ ప్రాణానికి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హరీశ్రావు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరఫున తప్పకుండా గళం విప్పుతామని ఆయన వెల్లడించారు. ‘‘బాండ్ పేపర్ల మీద సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి. అసెంబ్లీలో భట్టి విక్రమార్క 1:100 ఎలిజిబిలిటీ గ్రూప్ వన్ మెయిన్స్ కు ఇవ్వాలన్నారు ఏమైంది ? ప్రొఫెసర్ కోదండరాం ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టారు.ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. ‘‘ప్రజా పాలనలో నిరుద్యోగులు దరఖాస్తులు ఇస్తూ చిన్నారెడ్డి కాళ్ళ మీద పడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ యువకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ఇదేనా ప్రజాపాలన ? విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు వినిపిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Unemployed Protest : సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/protest-cm.jpg)
Unemployed Protest : సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన..
నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని సీఎం రేవంత్ కు తెలిసిన కూడా అదే తప్పు చేస్తున్నారని వారంతా హెచ్చరిస్తున్నారు