HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Says Pm Modi Is Like My Big Broher We Will Not Clash With The Centre Govt

CM Revanth – PM Modi : ప్రధాని మోడీ మా పెద్దన్న.. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోం: సీఎం రేవంత్

CM Revanth - PM Modi : ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.

  • By Pasha Published Date - 12:58 PM, Mon - 4 March 24
  • daily-hunt
Cm Revanth Pm Modi
Cm Revanth Pm Modi

CM Revanth – PM Modi : ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజకీయ వైరుధ్యాలకు భిన్నంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓకే వేదికను పంచుకున్నారు. ఇదే సభలో రాష్ట్రప్రథమ పౌరురాలు గవర్నర్‌ తమిళిసై కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా ముగ్గురు కలిసి 6,700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి జాతికి అంకితం చేశారు. ఆదిలాబాద్-బేల జాతీయరహదారి విస్తరణకు భూమిపూజ, అంబారి-ఆదిలాబాద్-పింపాల కట్టె రైల్వే లైన్‌ విద్యుదీకరణ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను ప్రధాని శ్రీకారం చుట్టారు. రాష్ట్రం గుండా పరుగులు పెట్టనున్న 3 వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఆ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరపున మేం ఘన స్వాగతం పలికాం. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్నలాంటి వారు. కేంద్ర సర్కారుతో ఘర్షణలు సరికావు. తమ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పెట్టుకోదలచుకోలేదు. ఘర్షణాత్మక వాతావరణం ఉంటే అభివృద్ధి వెనుకబడుతుంది. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు.. ఆ తర్వాత అంతా అభివృద్ధి గురించే చర్చలు ఉంటాయి.  మా వైపు నుంచి ఎటువంటి బేషజాలు ఉండవు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది పనుల గురించి చర్చించాం. వాటికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల, నిరంకుశ వైఖరి వల్ల  విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వెనుకబడింది’’ అని సీఎం రేవంత్ తెలిపారు.

Also Read : Lucky Zodiac Signs : ఒకేరోజు హోలీ, చంద్రగ్రహణం.. 4 రాశుల వారికి శుభాలు

‘‘కేంద్ర ప్రభుత్వంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్రం వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి తగిన కార్యాచరణతో మేం ముందుకెళ్తాం. మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణను డెవలప్ చేయడానికి మీ (ప్రధాని) సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్‌ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్‌ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించినందుకు ప్రధాని మోడీ ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది’’ అని రేవంత్ చెప్పారు.

Also Read : Life Style: హైట్ తక్కువ అని ఫీల్ అవుతున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి

అనంతరం ప్రసంగించిన ప్రధాని మోడీ.. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆదిలాబాద్‌లో ప్రారంభించిన అభివృద్ధి పనులే దానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుందని మోడీ తెలిపారు.

Also Read : KTR: ఈ నెల 6న అసెంబ్లీ ముందు.. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాః కేటీఆర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #CMRevanthReddy
  • Adilabad Meeting
  • CM Revanth -PM Modi
  • pm modi
  • prime minister modi

Related News

Harleen Deol Asks PM Modi

Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

Latest News

  • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

  • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

  • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

  • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd