CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
- By Pasha Published Date - 12:11 PM, Mon - 13 May 24
![CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/cm-revanth-kcr-ktr-voting-min.jpg)
CM Revanth : తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ఓటు వేశారు.
We’re now on WhatsApp. Click to Join
- కేసీఆర్ దంపతులు చింతమడకలో ఓటు వేశారు.
- నంది నగర్లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కేటీఆర్ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకుంది.
- హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న కార్మిక శాఖ ఆవరణలోని పోలింగ్ బూత్ లో సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి ఓటు వేశారు.
- సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్లోని 114ం పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
Also Read :AP Elections : భారీ పోలింగ్ దిశగా ఏపీ.. 2 గంటల్లోనే పది శాతం ఓటింగ్
హరీష్ రావు పిలుపు
ఓటు వేసిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘గతం కంటే ఈసారి రాష్ట్రంలోని పట్టణాలలో ఎక్కువగా పోలింగ్ జరుగుతోంది. ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే అందరూ ఓటింగ్లో పాల్గొనాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
ఓటు వేశాకే.. ఇతర పనులు చూసుకోవాలి : సజ్జనార్
ఓటు వేసిన అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. ‘‘భారత రాజ్యాంగం కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు వేసే హక్కును కల్పించింది. సమర్థ నాయకులను ఎన్నుకునేందుకు ఇది గొప్ప అవకాశం. ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. ముందు ఓటు వేసి.. ఆ తర్వాతే ఇతర పనులు చూసుకోవాలి. ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1.50 కోట్ల మంది బస్సుల్లో రాకపోకలు సాగించారు’’ అని వెల్లడించారు.
Also Read : NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/08/koushik-reddy.jpg)
BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!
BRS MLA: ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు.పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు అవ్వ తాత ఉసురు నీకు తాకుతుంది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్