HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr To Take Part In Maha Kumbha Samprokshan At Yadadri Temple On March 28

CM KCR: ‘యాదాద్రి సంప్రోక్షణ’కు కేసీఆర్!

తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి పున: ప్రారంభ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించడంతో తిరుమల తిరుపతికి తీసిపోనివిధంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది.

  • By Balu J Published Date - 03:55 PM, Fri - 25 March 22
  • daily-hunt
Kcr
Kcr

తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి పున: ప్రారంభ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించడంతో తిరుమల తిరుపతికి తీసిపోనివిధంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. భక్తుల క్యూలైన్స్ మొదలుకొని.. దైవదర్శనం వరకు తిరుమల తరహాలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్చి 28న యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునఃప్రారంభించడంలో భాగంగా నిర్వహించనున్న ‘మహాకుంభ సంప్రోక్షణ’లో పాల్గొననున్నారు. ఈ మేరకు ‘మహా కుంభ సంప్రోక్షణ’ నిర్వహణ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలాలయంలో వేద అర్చకులు పంచకుండాత్మక సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో దాదాపు 108 మంది రుత్విక్కులు పాల్గొంటారని సమాచారం.

ముఖ్యమంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి పట్టణం నుండి కొండ గుడి వరకు కూడా భారీ పోలీసు భద్రతను మోహరిస్తున్నారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ‘మహా కుంభ సంప్రోక్షణ’ ఇతర ఆచారాలు పూర్తయిన తర్వాత మాత్రమే భక్తులను కొండ గుడిపైకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలకు స్వస్తి వచనంతో ‘పంచకుండాత్మక సుదర్శన యాగం’ పూర్ణాహుతితో ముగుస్తుంది. అయితే ఆలయ సంప్రోక్షణ, పున:ప్రారంభ పనులకు ప్రధాని మోడీ, చినజీయర్ స్వామిలను ఆహ్వానించాలని గతంలో సీఎం కేసీఆర్ భావించారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో ఆ ఇద్దరు యాదాద్రికి వస్తారా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • pujas
  • yadadri district
  • Yadadri Temple

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd