CM KCR : ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారో..ఓ క్లారిటీ వచ్చేసింది…!! సైలెంట్ గా భారీ స్కెచ్..!!
తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.
- By hashtagu Published Date - 08:18 PM, Sat - 15 October 22
తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలో రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన కేసీఆర్…ఇప్పుడు హస్తినవైపు మళ్లాడు. విజయదశమి రోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కేసీఆర్…బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. మూడు రోజుల క్రితం యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ అంత్యక్రియలకు వెళ్లిన కేసీఆర్…అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉండిపోయారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారన్నది ఇప్పటివరకు ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీలోనే ఉండటం రాజకీయ వర్గాల్లో ఒక్కింత చర్చకు కారణమైంది. అయితే ఢిల్లీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యచరణపై తన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు మీడియా చెబుతోంది. కానీ అది నిజమా లేదా అన్నది క్లారిటీ మాత్రం మీడియా దగ్గర లేదు. ఇక స్థానిక మీడియా కేసీఆర్ ను పట్టించుకోవడమే మానేసింది.
మునుగోడు ఉపఎన్నికలో రాజకీయ పార్టీలతపాటు మీడియా కూడా ఫుల్ బిజీగా మారింది. బీఆర్ఎస్ గురించి మొదట్లో కవరేజ్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించిన మీడియా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో జాతీయ మీడియా కూడా బీఆర్ఎస్ ను పక్కన పెట్టింది. కేసీఆర్ మూడు, నాలుగు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నా…ఆయన గురించి ఎలాంటి వార్తలు బయటకు పొక్కడం లేదు. దీంతో కేసీఆర్ వర్గీయులు ఆసక్తికర వార్తలను లీక్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కేసీఆర్ పెద్దెత్తున ఫ్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 9న న్యూఢిల్లీలో భారీ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. బీఆర్ఎస్ కు సంబంధించి సిద్ధాంతాలను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు భారీ వాహనాల ర్యాలీ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏయే మార్గాల ద్వారా వెళ్లాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశారట. తర్వాత కొత్తగా విమానం కొనుగోలు చేసి దేశంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారామా లేక నిజంగానే కేసీఆర్ చేస్తారనేది వేచిచూడాల్సిందే.
Related News
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.