TS : స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో నెంబర్..1 గా తెలంగాణ…కేసీఆర్ హర్షం..!!
స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడం...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు ఇది నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్.
- By hashtagu Published Date - 08:10 AM, Sat - 24 September 22
స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడం…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు ఇది నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. గ్రామీణ స్వచ్చభారత్ మిషన్ లో తెలంగాణకు 13 అవార్డులు వచ్చాయని తెలిపారు. పల్లె ప్రగతిని సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే పరంపరను కొనసాగిస్తామంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.
స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్..ర్యాకింగ్స్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్చ్ భారత్ మిషన్ దివస్ 2022 కింద తెలంగాణకు కేంద్రం 13 అవార్డులను అందజేసింది. SSGసౌత్ జోన్ ర్యాంకింగ్స్ లో నిజామాబాద్, భద్రాద్తి కొత్తగూడెం రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. సుజలం క్యాంపెయిన్, జాతీయ చలన చిత్ర పోటీలు, వాల్ పెయింటింగ్ తోపాటు పలు పోటీల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ వేదికగా ఈ జాబితాను పోస్టు చేశారు.
#Telangana once again emerges as the top performing state in the ‘Swachh Survekshan Grameen’ rankings as the state was conferred 13 awards and was ranked first in large States category, by the Central government under the ‘#SwachhBharat Mission’ Divas 2022#PallePragathi pic.twitter.com/0Ln4BMItf2
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) September 23, 2022
Related News
Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం