TS Cabinet: పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలకు క్యాబినేట్ ఆమోదం!
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది.
- By Balu J Published Date - 11:58 PM, Sat - 10 December 22
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని క్యాబినేట్ నిర్ణయించింది.
నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ, క్యాబినేట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను క్యాబినేట్ ఆదేశించింది.
వీటితోపాటు..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు, భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నందున ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే సీఎం తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
— Telangana CMO (@TelanganaCMO) December 10, 2022
Related News
Telangana Cabinet Meeting : రాష్ట్ర గేయంగా ‘జయజయహే తెలంగాణ’
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గ్యారెంటీ హామీలలో ఇప్పటికే రెండు హామీలు ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు ను అమలు చేయగా..ఇప్పుడు మరో రెండు హామీలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు ఆమోదం తెలిపింది. We’re now on WhatsApp. Click to [&hell