Singireddy: రేవంత్.. కేసీఆర్ కు మించి పనులు చేసి గొప్ప వ్యక్తి అనిపించుకో!
- By Balu J Published Date - 07:10 PM, Thu - 22 February 24
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తీరు, ప్రభుత్వ పథకాల అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ లో ఓడిపోయాక మల్కాజ్ గిరిలో గెలిచి ఎంపీ అయ్యాక రేవంత్ ఎన్ని సార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారు? అని, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర గుండు సున్నా .. కొడంగల్ లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకే రేవంత్ పనులు చేస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ కు చేసిన పనులు మొత్తం పాలమూరుకు చేస్తున్నట్లు రేవంత్ భ్రమలు కల్పిస్తున్నారని సింగిరెడ్డి సీఎం పై ఫైర్ అయ్యారు.
‘‘35 ఏండ్లు, 40 ఏండ్ల పాటు పాలమూరు ప్రాజెక్టులను సాగదీసిన కాంగ్రెస్ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టారు. 3.94 లక్షల ఎకరాల కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం 3.9 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించారు .. 17 రిజర్వాయర్లను టెండర్లకు ముందే కాంగ్రెస్ ఎత్తివేసింది కల్వకుర్తి పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిలలో ఉన్న ఐదు పంపులు ఎన్నడూ నడవవు .. ఐదూ నడిస్తే టన్నెళ్లు, కాలువలు సరిపోవు’’ అని ఆయన అన్నారు.
‘‘కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చాడు అని చవకబారు మాట్లాడడం భావ్యం కాదు .. రేవంత్ కొడంగల్ ఎందుకు వెళ్లాడు ? మల్కాజ్ గిరి ఎందుకు వెళ్లాడు ? రాహుల్ వాయనాడ్, సోనియాగాంధీ రాజస్థాన్ ఎందుకు వెళ్లారు?. కేసీఆర్ కేంద్రమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ని చోట్లా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై సేవలు అందించారు. కేసీఆర్ కు మించి పనులు చేసి రేవంత్ గొప్ప వ్యక్తి అనిపించుకుంటే మాకు ఎలాంటి అసూయ లేదు. మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయలేరు. ఒకటో గ్యారంటీ, రెండో గ్యారంటీ అంటూ హామీలను అరాజ్ పాటలా ప్రకటిస్తున్నారు. రైతుబంధు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ? ఎండిన పంటలు, సాగిన సాగు వెనక్కు వస్తాయా? అని సింగిరెడ్డి అన్నారు.
Related News
Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.