HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Achieves Rare Record Despite Not Having Power

BRS Donations: అధికారం లేకపోయినా అరుదైన రికార్డు సాధించిన బిఆర్ఎస్

BRS Donations: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏడీఆర్ (Association for Democratic Reforms) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కలిపి రూ.2,532.09 కోట్ల ఆదాయం పొందాయి

  • Author : Sudheer Date : 11-09-2025 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs
Brs

భారతదేశ రాజకీయ వ్యవస్థలో విరాళాలు (Donations) కీలకమైన పాత్ర పోషిస్తాయి. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు విరాళాలు భారీగా రాబడతాయనే వాస్తవం అందరికీ తెలిసిందే. ఇవి పార్టీపై ప్రేమతో వచ్చినవే కావని, కొన్నిసార్లు బ్లాక్‌మెయిల్, కమిషన్ల రూపంలో వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏడీఆర్ (Association for Democratic Reforms) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కలిపి రూ.2,532.09 కోట్ల ఆదాయం పొందాయి. వీటిలో 70 శాతం కంటే ఎక్కువ నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని ఆ రిపోర్టు స్పష్టంగా పేర్కొంది.

ఈ జాబితాలో భారత రాష్ట్ర సమితి (BRS) అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క బీఆర్ఎస్ పార్టీనే రూ.685.51 కోట్లు సేకరించగా, తరువాత స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (రూ.646.39 కోట్లు), బిజు జనతాదళ్ (రూ.297.81 కోట్లు), తెలుగుదేశం పార్టీ (రూ.285.07 కోట్లు), వైఎస్ఆర్ కాంగ్రెస్ (రూ.191.04 కోట్లు) నిలిచాయి. ఈ ఐదు పార్టీలకే మొత్తం ఆదాయంలో 83.17 శాతం వాటా దక్కింది. ఆశ్చర్యకరంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎక్కువ విరాళాలు పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది వైసీపీ బలహీనతలను, ఆ పార్టీపై విరాళాదారుల నమ్మకం తగ్గిపోయిందనేది స్పష్టంగా తెలియజేస్తుంది.

Heavy Rains : రాయలసీమలో దంచి కొడుతున్న భారీ వర్షాలు..స్కూల్స్ కు సెలవు

2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023-24లో ప్రాంతీయ పార్టీల ఆదాయం 45.77 శాతం పెరిగింది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.1,796.02 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. బీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే, బీజేడీ, టీడీపీ, వైసీపీ వంటి పది పార్టీలు కలిపి ఈ మొత్తాన్ని పొందాయి. ఆసక్తికరంగా కొన్ని పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ముఖ్యంగా వైసీపీ, మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో 55 శాతం అధికంగా ఖర్చు పెట్టినా, చివరికి అధికారాన్ని కూడా కోల్పోయింది, నిధులను కూడా కోల్పోయింది. మరోవైపు బీఆర్ఎస్, టీఎంసీ, బీజేడీ వంటి పార్టీలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా నిల్వ ఉంచాయి.

ఇక ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం చివరికి సుప్రీంకోర్టు వద్ద తేలింది. 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి రద్దు చేసింది. ఓటర్లకు సమాచారం తెలుసుకునే హక్కును (ఆర్టికల్ 19(1)(a)) ఇది ఉల్లంఘిస్తుందని, రాజకీయ నిధుల విషయంలో పారదర్శకతను దెబ్బతీసిందని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ బెంచ్ పేర్కొంది. ఈ తీర్పుతో ఇప్పటివరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించిన ప్రాంతీయ పార్టీలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాయని తేలిపోయింది. మొత్తంగా చూస్తే, ఎలక్టోరల్ బాండ్లు ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఆదాయం అందించినా, పారదర్శకత లేని ఈ విధానం రాజకీయ వ్యవస్థపై అనుమానాల ముసురు వేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ADR report
  • brs
  • BRS Donations
  • tdp
  • ycp

Related News

Krishnamohan

YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, గతంలో పార్టీని వీడిన సీనియర్ నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది.

    Latest News

    • Gold Prices: పెరుగుతున్న బంగారం ధరలు

    • కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

    • Gas Cylinder Booking : కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

    • శ్రీదేవి ఆస్తి కోసం.. మద్రాస్ హైకోర్టుకు బోనీ కపూర్

    • Rashid Khan : పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd