BJP Announces: మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఫిక్స్!
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డియే అయినప్పటికీ,
- By Balu J Published Date - 02:22 PM, Sat - 8 October 22
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డియే అయినప్పటికీ, అధిష్టానం అధికారికంగా ఫిక్స్ చేసింది. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రకటిస్తూ బీజేపీ హైకమాండ్ శనివారం స్పష్టం చేసింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్తో కలిసి రాజగోపాల్రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.
రాజగోపాల్కు చెందిన కంపెనీలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ఆరోపణలు చేస్తున్నారని వివేక్ విమర్శించారు. “సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజగోపాల్ సంస్థలకు నాలుగు కాంట్రాక్టులు మంజూరు చేయబడ్డాయి” అని ఆయన ఎత్తి చూపారు.
ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేత ఆరోపించారు. కేటీఆర్పై రాజగోపాల్ కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Related News
UP : పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి ..
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సర్వేష్ కుమార్.. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు