Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులపై వేధింపులు.ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్..!!
- By hashtagu Published Date - 09:43 AM, Fri - 25 November 22
బాసర ట్రిపుల్ ఐటీ ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. మొన్న ర్యాగింగ్ పేరుతో వార్తల్లోక్కి ఎక్కితే…ఇప్పుడు విద్యార్థినులపై వేధింపులతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. విద్యార్థినులను వేధించిన ఘటనలో ఇద్దరు కళాశాల ఉద్యోగులపై అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది. ఓ శాఖలో అటెండర్ విద్యార్థినులను బ్లాక్ మెయిస్ చేశారని..అధికారులకు ఫిర్యాదు చేయడంలో ఈ వ్యవహారం బయటపడింది. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఉద్యోగుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.
కాగా తమకు దగ్గరి బంధువు కావడంతో పలకించేంవాడిని ఆ ఉద్యోగి చెప్పినట్లు సమాచారం. అయితే అతని భార్యను కళాశాలలో రహస్యంగా విచారించినట్లు తెలిసింది. ఆ విద్యార్థితో ఎలాంటి బంధుత్వం లేనట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఓ కమిటిని వేసిన అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. అయితే ఏ అంశంపై కమిటీ వేశారన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేనట్లు సమాచారం.
Tags
Related News
AP : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెండ్
వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం తో ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.