HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Bandi Sanjay Demands New Tribunal To For Krishna Water

Tribunal: క్రిష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయండి… కేంద్రమంత్రి ‘షెకావత్’ ను కోరిన ‘బండి సంజయ్’

ష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు.

  • By Hashtag U Published Date - 10:01 PM, Wed - 16 March 22
  • daily-hunt
Bandi Krishna Water
Bandi Krishna Water

క్రిష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. బుధవారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డిలతో కలిసి పార్లమెంట్ హౌజ్ లోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసి క్రిష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు.

ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు పేర్కొన్నారు. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతుందని, తెలంగాణకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ నేతల విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఈ అంశం తన ద్రుష్టిలో ఉందని పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రితో చర్చిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిష్ణా నదీ జలాల పంపిణీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఉఫసంహరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేసిందని, దీనివల్లే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందని తెలిపారు.

సమావేశానంతరం బండి సంజయ్ మాట్లాడుతూ క్రిష్ణా నదీ జలాల విషయంలో కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలన్న తమ విజ్ఝప్తి పట్ల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • krishna river water
  • new tribunal demanded
  • telangana bjp chief

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd