MLC Kavitha: మేడారం ఉత్సవాలకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలే!
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు.
- By Balu J Published Date - 01:17 PM, Tue - 25 January 22
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు. మేడారం జాతర పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఎమ్మెల్సీ ప్రశ్నించారు. “ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర జరగడం మాకు గర్వకారణం” అని ఆమె సోమవారం ట్వీట్ చేశారు.
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల కాపీలను కూడా ఎమ్మెల్సీ కవిత షేర్ చేశారు. గత నాలుగేళ్ల నుంచి మేడారం ఉత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.332.71 కోట్లు కేటాయించారని ఆమె తెలిపారు. మేడారం ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు మంజూరు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరినప్పటికీ ఉత్సవాలకు జాతీయ పండుగ హోదా కల్పించడంలో విఫలమైందని ఆమె బండి సంజయ్ను ప్రశ్నించారు.
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం శ్రీ కేసీఆర్ గారు మొత్తం ₹ 332.71 కోట్లను విడుదల చేశారు#Medaram #మేడారం pic.twitter.com/kqnLqa9rJ5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2022
Related News
KTR: నా దగ్గర ఆధారాలు ఉన్నాయి..కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతాః బండి సంజయ్
సంజయ్ మీడియతో మాట్లాడుతూ.. త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానని.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.