Controversy: కాళేశ్వరంలో అవినీతి ‘మేఘాలు’
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి విందు బయటపడుతోంది. ది పోర్టల్, ది న్యూస్ మినిట్ అనే పరిశోధనాత్మక కథనం ఆధారాలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
- By Hashtag U Published Date - 10:18 PM, Fri - 28 January 22
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి విందు బయటపడుతోంది. ది పోర్టల్, ది న్యూస్ మినిట్ అనే పరిశోధనాత్మక కథనం ఆధారాలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. వాటిని నిరూపించేందుకు సీబీఐ రంగంలోకి దిగుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కచ్చితంగా జైలుకు వెళ్లాలని సవాల్ విసిరారు. కేంద్రానికి అన్ని ఆధారాలు ఇచ్చామని కూడా చెప్పారు. కేసీఆర్ కుటుంబ దోపిడీని కేంద్రం వెలికితీస్తుందని అన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం నిర్మిస్తున్న సంస్థ ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్తె పెళ్లికి చేసిన చెల్లింపులు బయటపడ్డాయి. దీంతో ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు పదును పెట్టింది.
కాంగ్రెస్ మినిట్ స్టోరీ ఆధారంగా ఢిల్లీలో కాళేశ్వరం అంశాన్ని తేల్చాలని బీజేపీ చూస్తోంది. కేంద్రంలోని బీజేపీ తలచుకుంటే వెంటనే విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయంగా పలు అంశాలపై ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కానీ, ఢిల్లీ రాజకీయ సమీకరణాల క్రమంలో రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే కాళేశ్వరం అంశాన్ని ప్రగతి భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
Who sponsored the five-star wedding of Telangana's Special Chief Secretary (Irrigation) Rajat Kumar's daughter?
Was it done as Quid pro quo?
— Revanth Reddy (@revanth_anumula) January 27, 2022
రంజిత్ కుమార్ కుమార్తె వివాహానికి ప్రభుత్వ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు లేఖాస్త్రాన్ని సంధించాడు.
“రజత్ కుమార్ కుమార్తె యొక్క ఐదు నక్షత్రాల వివాహ వేడుక ఖర్చులను షెల్స్ కంపెనీలు (బిగ్వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్) చెల్లించాయని ఆరోపించాడు. మినిట్ పోర్టల్ కథనాన్ని లేఖలో పొందు పరిచాడు. దాని ప్రకారం.
విలాసవంతమైన తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో విందుతోపాటు ఐదు రోజుల వివాహ వేడుకలు హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లలో జరిపారు. ఖర్చులలో గణనీయమైన భాగం BigWave Infra Pvt Ltdకి బిల్ చేయబడింది.
తదుపరి విచారణలో హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న కంపెనీ చిరునామా నకిలీదని తేలింది. తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్ మరియు తాజ్ ఫలక్నుమా హోటళ్లు వేదికలు మరియు ఇతర అనుసంధాన పనులలో MEIL యొక్క కొంతమంది ఉన్నతాధికారులు సన్నిహితంగా పాల్గొన్నారు. వారు తమ కంపెనీ ఇమెయిల్ IDలను మరియు డమ్మీ ఇమెయిల్ IDని కూడా ఉపయోగించారు.
MEIL లేదా దాని షెల్ కంపెనీలు లేదా ఇతర కంపెనీలు తన ప్రైవేట్ బిల్లులు చెల్లించడం ద్వారా రజత్ కుమార్ ఫేవర్ తీసుకున్నారా? క్విడ్ ప్రోకో ప్రాతిపదికన జరిగిందా తేల్చాలి. రూ.కోటికి పైగా బిల్లులు చెల్లించేలా చేసి ఆ కంపెనీలకు ఎలాంటి సాయం అందించాడు. ఆరోపణలు అవాస్తవమైనప్పటికీ, అధిక బిల్లులు చెల్లించడానికి ఉపయోగించిన డబ్బు మూలాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి రజత్ ను అడగాలి? ఆరోపణలు నిజమైతే రజత్ కుమార్తో పాటు వివాహ ప్రణాళికలో పాల్గొన్న ఇతర అధికారులపై అవినీతి కేసు నమోదు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టాలని, వాటి అమలులో ఉన్న అన్ని ప్రాజెక్టులపై విచారణకు ఆదేశించాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
రజత్కుమార్పై వచ్చిన ఆరోపణలు నిజమైతే సీనియర్ ఐఏఎస్ల ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ జరపాలని రెడ్డి అన్నారు.
ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు రజత్ కుమార్కు ఎలాంటి పదవిని కేటాయించవద్దని కోరాడు. విచారణ పూర్తయ్యే వరకు ఎంఈఐఎల్కు ఎలాంటి తాజా కాంట్రాక్టు ఇవ్వకూడదు’’ అని ఆయన అన్నారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో కదలిక తీసుకొచ్చింది. ఇక బీజేపీ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Invoice Pic Courtesy- The News Minute
(Hashtag U did not verify the content and its ownership. This article is published on larger public interest of users as a trending topic. We are no way associated with the news)
Tags
Related News
Telangana Govt : మే 13, జూన్ 4న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Lok Sabha Election: లోక్సభ ఎన్నిలక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఈనెల 13 సెలవు(holiday) ప్రకటించింది. ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ 13న జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓట్ల కౌంటింగ్ రోజు అయిన జూన్ 4న కూడా ప్రభుత్వం హాలీడే డిక్లేర్ చేసింది. మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. We’re now on WhatsApp. Click […]