CCTV : నిఘా నేత్రంలో తెలంగాణ.. 8.3 లక్షల కెమెరాలతో మానిటరింగ్!
హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా.. అన్ని కులాలు, జాతులవాళ్లు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందతుంటారు. విద్య, వైద్య, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు నిలయంగా మారుతోంది.
- By Balu J Published Date - 02:46 PM, Wed - 10 November 21
హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా.. అన్ని కులాలు, జాతులవాళ్లు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందతుంటారు. విద్య, వైద్య, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు నిలయంగా మారుతోంది. ఒకవైపు డెవలప్ మెంట్ లో దూసుకుపోతుంటే.. మరోవైపు సోషల్ ఇష్యూ లాంటి సమస్యలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా మానక అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ ప్లేస్ లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే తెలంగాణ పోలీస్ యంత్రాగం లైంగిక అక్రమ రవాణా, చోరీలు, హత్యలు లాంటివన్నీ నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. పై సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసింది. తద్వారా నేరాలను అరికట్టే దిశగా ముందుకు సాగుతోంది.
హైదరాబాద్ టోటల్ సిటీగా నిఘానేత్రంగా అవతరించనుంది. విస్తృతమైన నిఘా మానవ హక్కులను ప్రమాదంలో పడేస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో పేర్కొంది, తెలంగాణ పోలీస్ వ్యవస్థ CCTV కెమెరా నెట్వర్క్ ఏర్పాటుపై దృష్టి సారించింది. తెలంగాణ అంతటా దాదాపు 8.3 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అటాచ్ చేసి ఉంటాయి. తద్వారా భద్రతా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వీలు కలుగుతుంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకేసారి 600,000 కెమెరాల డేటాను ప్రాసెస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. వ్యక్తులను ట్రాక్ చేయడానికి ఈ కెమెరాలను హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక సాఫ్ట్ వేర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’ ద్వారా మీరు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి చేస్తారు? లాంటి విషయాలను సులువుగా తెలుసుకోవచ్చును. అయితే ఈ రకం టెక్నాలజీని కొందరు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి గోప్యత మానవ హక్కులను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ముఖ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని భారత అధికారులు తక్షణమే నిలిపివేయడం అత్యవసరమని న్యాయవాది అనుష్క జైన్ అభిప్రాయపడ్డారు.
Tags
Related News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనే�