Banyan Tree: 70 ఏళ్ల మర్రిచెట్టుకు ఊపిరిపోశారు!
మొక్కలు, చెట్లకు సైతం ప్రాణం ఉంటుంది. మానవుల్లాగే చెట్లు కూడా ప్రాణం కోసం తపిస్తాయి. అయితే రహదారుల విస్తరణ, గ్రామాల డెవలప్ మెంట్ పనుల కారణంగా ఎన్నో ఏళ్ల నాటి చెట్లు నేలమట్టమవుతున్నాయి.
- By Balu J Published Date - 04:01 PM, Mon - 14 February 22
మొక్కలు, చెట్లకు సైతం ప్రాణం ఉంటుంది. మానవుల్లాగే చెట్లు కూడా ప్రాణం కోసం తపిస్తాయి. అయితే రహదారుల విస్తరణ, గ్రామాల డెవలప్ మెంట్ పనుల కారణంగా ఎన్నో ఏళ్ల నాటి చెట్లు నేలమట్టమవుతున్నాయి. సరైన జాగ్రత్త చర్యలు తీసుకుంటే వాటికి మళ్లీ ప్రాణం చేయొచ్చని నిరూపించాడో వ్యక్తి. సిరిసిల్ల కలెక్టరేట్ ఆవరణలో 70 ఏళ్ల నాటి కూలిన మర్రి చెట్టును పర్యావరణవేత్త బతికించారు. నీరు, ఇతర రక్షణ జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా నేలకూలిన మర్రి చెట్టును బతికించడానికి పర్యావరణవేత్త బొబ్బల ప్రకాష్ కృషి చేశారు. ఆదివారం రాజ్యసభ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మద్దతుతో చెట్టును నాటారు. మూడు నెలల క్రితం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు కోనరావుపేట మండలం సుద్దాలలో బుర్ర భూమయ్యగౌడ్, బుర్ర రమేష్ గౌడ్ వ్యవసాయ పొలాల్లో ఉన్న 70 ఏళ్ల మర్రి చెట్టు నేలమట్టమైంది.
నెలకొరిగిన కొద్ది రోజులకే నీటి వసతి లేకపోవడంతో చెట్టు ఎండిపోవడం ప్రారంభించింది. అదే గ్రామానికి చెందిన పర్యావరణవేత్త బొబ్బల ప్రకాష్ చెట్టు ఎండిపోవడాన్ని గమనించి చెట్టును రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రకాష్ రెండో ఆలోచన లేకుండా వ్యవసాయ బావి ఉన్న పొరుగు రైతు బొబ్బల దాస్ని ఒప్పించి చెట్టుకు నీరు సరఫరా అందించాడు. సిరిసిల్ల, తెలంగాణ సాంస్కృతిక మండలి విభాగంలో కళాకారుడిగా పని చేయడంతో పాటు, ప్రకాష్ రెండు నెలలుగా చెట్లకు నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేశారు. ఫలితంగా, నేలకూలిన చెట్టు సజీవంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు, ఎంపీ సంతోష్ కుమార్ ప్రకాష్ కృషిని అభినందించారు.
నీరు సక్రమంగా సరఫరా అవుతుండటంతో వేర్లకు సరిపడిన బురద క్రమంగా పడిపోవడంతో చెట్టుకు సరిపడా నీరు లభించలేదు. దీంతో ప్రకాష్ చెట్టును నాటాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో, ప్రకాష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చెట్టును నాటాలని అనుకున్నాడు, కాని అంత పెద్ద చెట్టును నాటడం ఖరీదైనది కాబట్టి డబ్బు లేకపోవడంతో తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు. రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ చెట్టును నాటేందుకు సహకరించేందుకు ముందుకొచ్చారు. ఆదివారం చిన్న కొమ్మలను నరికి చెట్టును కలెక్టరేట్కు తరలించారు. చెట్టును పైకి లేపేందుకు రెండు భారీ క్రేన్ల సాయం తీసుకోవాల్సి వచ్చింది. సుద్దాల నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి 14 కిలోమీటర్ల మేర చెట్టును తరలించేందుకు 40 అడుగుల పొడవున్న ట్రాలీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో చెట్టును నాటారు.
Related News
Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ
Elephants Attack : ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల ప్రజలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.