Komatireddy: లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి
- By Balu J Published Date - 01:18 PM, Tue - 23 January 24
Komatireddy: లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న తనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లలో అక్రమాలతో పాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలులో అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.
“ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసినందుకు మంత్రి పదవులు వదులుకున్నాను. జగదీష్ రెడ్డికి నా గురించి మాట్లాడే హక్కు లేదు, అహంకారి ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం పట్టించుకోని ఆయన.. యాదాద్రి పవర్ ప్లాంట్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్ అక్రమాలు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కుంభకోణాలను పాల్పడి నాపై ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
విజిలెన్స్ విచారణ నివేదిక బయటకు వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆపలేరని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యుల తర్వాత జైలుకు వెళ్లిన రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డి అని కోమటిరెడ్డి అన్నారు. ప్రజల్లో విశ్వసనీయత లేని జగదీశ్రెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: Barrelakka: లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ, ఎక్కడ్నుంచో తెలుసా
Related News
Komatireddy: కాంగ్రెస్ను తాకాలని చూస్తే బీఆర్ఎస్ పునాదులను ధ్వంసం చేస్తాం: కోమటిరెడ్డి
Komatireddy: కాంగ్రెస్ను తాకాలని చూస్తే బీఆర్ఎస్ పునాదులే ధ్వంసమవుతాయని భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావును రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించిన ఆయన మూడు నెలల్లో బీఆర్ఎస్ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమ�