HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >1971 Pakistan Tank Sitting As War Trophy On Hyderabads Iconic Tank Bund

Indo Pak War : ఇండో పాక్ యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తి

1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరిగి నేటికి అర్ధ శతాబ్దం పూర్తయ్యింది. డిసెంబరు 3, 1971 సాయంత్రం మొదలయిన యుద్ధం డిసెంబరు 16, 1971 తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడింది. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది.

  • By Siddartha Kallepelly Published Date - 02:19 PM, Thu - 16 December 21
  • daily-hunt

1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరిగి నేటికి అర్ధ శతాబ్దం పూర్తయ్యింది. డిసెంబరు 3, 1971 సాయంత్రం మొదలయిన యుద్ధం డిసెంబరు 16, 1971 తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడింది. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. అతి తక్కువ రోజుల్లో ముగిసిన యుద్ధంగా ఇది రికార్డులకెక్కింది.భారత్ లోని 11 వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. భారతదేశ త్రివిధ దళాలు తొలిసారి ఐక్యంగా ఒక దేశంపై పోరాడడం ఇదే మొదటిసారి. ఈ యుద్ధంలో ఇండియా దాదాపు 15,010 కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.


యుద్ధం జరుగుతోన్న సమయంలో ఇండియా పాక్ బలగాలు తూర్పు, పడమటి దిశలలో ఘర్షణ పడ్డారు. తూర్పు కమాండ్‌కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు లొంగుబాటు పత్రం పై సంతకాలు చేసాక, యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇంతపెద్ద మొత్తంలో ఒక దేశ సైన్యం మరోదేశ సైన్యానికి బయపడి లొంగిపోవడం ఇదే తొలిసారి.1971 డిసెంబరు 16నాటి లొంగుబాటు తరువాత తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న సుమారు 97,368 పశ్చిమ పాకిస్తానీలను ఇండియా తమ యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది.

అందులో 79,700 మంది పాక్ సైన్యానికి చెందిన సైనికులు, పారామిలిటరి సిబ్బంది, మరో 12,500 మంది సాధారణ ప్రజలు ఉన్నారు.యుద్ధంవల్ల ఇరుదేశాలకు ప్రాణనష్టం తప్పలేదు. ఆ యుద్ధం రెండు దేశాల ప్రజల మధ్యన పెంచిన దూరం ఇప్పటికీ తగ్గడం లేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1971 india pakistan war
  • indo pak war
  • tank bund hyderabad

Related News

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd