Redmi a1 Plus: తక్కువ ధరకే రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్..ధర,ఫీచర్లు ఇవే!
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ ఇటీవల కాలంలో వరుసగా స్మార్ట్ ఫోన్ లను భారత మార్కెట్లోకి విడుదల
- By Nakshatra Published Date - 04:54 PM, Sat - 15 October 22
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ ఇటీవల కాలంలో వరుసగా స్మార్ట్ ఫోన్ లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మార్కెట్ లోకి మరొక కొత్త ఫోన్ ను విడుదల చేసింది. రెడ్ మీ సంస్థ ఇటివలే రెడ్ మీ ఏ 1 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసింది. కాగా తాజాగా రెడ్ మీ ఏ1 కు కొనసాగింపుగా రెడ్ మీ ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. తాజాగా అక్టోబర్ 14వ తేదీన భారత మార్కెట్ లోకి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేశారు.
వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలు తీసుకువచ్చారు. కాగా తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభం ధర రూ.7,500 గా ఉంది. అయితే బడ్జెట్ తక్కువే అయినప్పటికీ ఫీచర్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. రెడ్ మీ ఏ1 ప్లస్ ఫీచర్ ల విషయానికి వస్తే..రెడ్మీ ఏ1 స్మార్ట్ఫోన్లో 6.52 హెచ్డీ ప్లస్ డిస్ప్లే ను అందించారు. మీడియా టెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ను బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 7499 కాగా, 3 జీబీ వేరియంట్ ధర రూ. 8,499గా ఉంది. ఇకపోతే ఈ ఫోన్ మొదటి సేల్లో భాగంగా అక్టోబర్ 17వ తేదీన ఫ్లిప్కార్ట్ తో పాటు రెడ్మీ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు డిస్కౌంట్లో లభించనుంది.
Related News
Smartphone Pinky : ‘స్మార్ట్ఫోన్ పింకీ’ వస్తోంది.. బీ కేర్ ఫుల్ !!
Smartphone Pinky : స్మార్ట్ఫోన్ను మనలో చాలామంది అతిగా వాడేస్తున్నారు.