Bajaj Offer: ఈ బైక్ కొనుగోలుతో మీ డ్రీమ్ నెరవేయడంతో పాటు డబ్బు ఆదా.. ఇంతకీ ఆ బైక్ ఏదంటే!
ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ ఇప్పుడు కొన్ని రకాల బైక్స్ పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఆ ఆఫర్స్ తో తక్కువ ధరకే బైక్ రేస్ సొంతం చేసుకోవచ్చట.
- By Anshu Published Date - 11:32 AM, Thu - 12 December 24

ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల బైక్స్ చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అందులో కొన్ని బైక్స్ పెట్రోల్ తో నడుస్తుండగా మరికొన్ని బైక్స్ కరెంటుతో నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇందనంతో నడిచే వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు వీటికి పోటీగా మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ అలాగే పెట్రోలుతో కాకుండా సీఎన్ జీ తో నడిచే మొట్టమొదటి మోటార్ సైకిల్ ను విడుదల చేసింది బజాజ్. పెట్రోలు వాహనాలతో పోల్చితే దీనికి నిర్వహణ ఖర్చులు 50 శాతం తగ్గుతాయని తెలిపింది. గత జూలైలో రూ.95 వేల కు విడుదల చేసింది. ప్రస్తుతం మరో పదివేల తగ్గింపు అమలు చేస్తోంది.
ప్రపంచంలో పెట్రోలు, ఎలక్ట్రిక్ కాకుండా సీఎన్ జీ తో నడిచే మొట్టమెదటి మోటారు సైకిల్ ఫ్రీడమ్ 125. దీంతో ఈ బైక్ విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. దేశ మార్కెట్ లోకి జూలైలో ఘనంగా విడుదలైంది. ఐదు నెలల్లోనే రూ.పది వేల తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. సీఎన్ జీతో పాటు పెట్రోలుతో కూడా ఈ బండి నడిచేలా ఏర్పాట్లు చేశారు. వాహన యజమాని తన అవసరాలన్ని బట్టి ఈ వాహనంని వినియోగించుకోవచ్చట. కాగా బజాజ్ ఇప్పటివరకు దేశంలోని డీలర్లకు దాదాపు 80 వేల ఫ్రీడమ్ 125 సీఎన్ జీ మోటారు సైకిళ్లను కంపెనీ సరఫరా చేసింది. ఐదు నెలల్లో దాదాపు 35 వేల వాహనాల అమ్మకాలు కూడా జరిగాయి. అయితే ధర తగ్గింపు వెనుక గల కారణాన్ని కంపెనీ మాత్రం వెల్లడించలేదు. కానీ సంవత్సరం పూర్తి కానున్నడడంతో పెండింగ్ జాబితాను క్లియర్ చేసుకోవడానికి ఈ చర్యలు తీసుకుందని భావిస్తున్నారు.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్ జీ మోటారు సైకిల్ మూడు రకాల వేరియంట్లలో విడుదలైంది. వాటికి డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అని పేర్లు పెట్టారు. వీటిలోని మొదటి రెండు వేరియంట్లకు ధరలను కంపెనీ తగ్గించింది. డ్రమ్ వేరియంట్ ధర రూ.95 వేలు కాగా, దానిపై రూ.5 వేలు తగ్గించి, రూ.90 వేలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. డ్రమ్ ఎల్ఈడీ రూ.1.05 లక్షలు కాగా, దానిపై రూ.పదివేల తగ్గింపు ప్రకటించింది. దీంతో బండి రూ.95 వేలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలుగా ఉన్నాయి.
ఈ మోటారు సైకిల్ సీటు కింద సీఎన్ జీ ట్యాంక్ అమర్చారు. దీనిలో పాటు 125 సీసీ పెట్రోలు ఇంజిన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ నుంచి 9.4 బీహెచ్ పీ, 9.7 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఈ బైక్ సీఎన్జీతో నడిచేటప్పుడు కేజీ కి 102 కిలో మీటర్లు, పెట్రోలు తో నడిచినప్పుడు 64 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం సీఎన్ జీతో నడిచే కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ తో పోల్చితే వీటికి నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య ఉద్గారాలు విడుదల కావు. దీంతో చాలామంది ఈ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మాదిరిగా బజాజ్ ఆటో నుంచి ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ కూడా విడుదలైంది.