Legal Case
-
#Andhra Pradesh
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్లో అభ్యర్థించారు.
Published Date - 11:45 AM, Tue - 11 February 25