Wasim Akram: పాకిస్థాన్ జట్టుపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు, ప్రతిరోజూ 8 కిలోల మటన్ తింటారంటూ ఫైర్
దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ పాకిస్తాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Balu J Published Date - 12:27 PM, Tue - 24 October 23
Wasim Akram: దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ పాకిస్తాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్లో గత సాయంత్రం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోవడంతో వసీం అక్రమ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం నేతృత్వంలో భారత్లో వరల్డ్ కప్ ఆడుతున్న ప్రస్తుత టీం అత్యంత చెత్త జట్టుగా అర్హత పొందగలదు. ఆటగాళ్ళు పరమ చెత్తగా ఆడుతున్నారు. ఇక కెప్టెన్ బాబర్ ఆలోచనలకు పదును లేకుండాపోయింది. ప్రతి రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్టు కనిపిస్తున్నారు.
వీళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించొద్దా..? అని అక్రమ్ ప్రశ్నించాడు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్గా ఫిట్గా ఉండాలి.. సెలక్షన్కు ఓ పద్దతి ఉండాలి అంటూ అక్రమ్ సూచించాడు. పాకిస్తాన్ జట్టు హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది, ఇటీవల సోమవారం చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. పాకిస్తాన్ ఆటను చివరి ఓవర్కు తీసుకెళ్లి ఉండవచ్చు, కానీ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోవడం ఓ సంచలనం.
బ్యాటర్లు 282 పరుగులను బాగానే చేసారు, కానీ పాకిస్తాన్ బౌలింగ్ లైనప్లో ప్రాణం లేదు. హరీస్ రవూఫ్ ఇష్టానుసారంగా పరుగులను లీక్ చేస్తూ మరో భారీ నిరాశపరిచాడు. ఫీల్డింగ్ అనేది ఆటగాడి ఫిట్నెస్ స్థాయిలకు తెలియజేస్తుంది. జట్టు అద్దంలో తమను తాము బాగా చూసుకోవాలని అక్రమ్ చెప్పాడు. ఐదు మ్యాచ్ల తర్వాత, పాకిస్తాన్ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. ఆప్గాన్ పై ఓడిపోవడం సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది.
Related News
Harish Rao: తప్పుడు ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: హరీశ్ రావు
Harish Rao: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సీఏం రేవంత్ రెడ్డికి డిల్లి పోలీసులు నోటిసులు ఇచ్చారని, తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు నోటీసుకు ఇచ్చారని, అస్సాంలో ఒకర్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చే�