Sania Mirza: వింబుల్డన్ కు సానియా ఎమోషనల్ గుడ్ బై
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా త్వరలోనే ఆటకు వీడ్కోలు పలకబోతోంది.
- By Naresh Kumar Published Date - 11:09 PM, Thu - 7 July 22
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా త్వరలోనే ఆటకు వీడ్కోలు పలకబోతోంది. గతంలోనే ఈ విషయాన్ని ఆమె ప్రకటించిన నేపథ్యంలో వింబుల్డన్ లో తన చివరి మ్యాచ్ ను ఆడింది.
అయితే ఇక్కడ మరో టైటిల్ గెలవాలనుకున్న ఆమె ఆశలు నెరవేరలేదు. మిక్సిడ్ డబుల్స్ సెమీస్ లో సానియా జోడీ పరాజయం పాలైంది. క్రొయేషియాకు చెందిన పావిక్ తో బరిలోకి దిగిన సానియా 6-4 , 5-7, 4-6 స్కోర్ తో క్రాజిక్ , స్కుప్సీ జోడీ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం సానియా తన ట్విట్టర్ లో భావోద్వేగపు లేఖను పోస్ట్ చేసింది. 20 ఏళ్ళుగా వింబూల్డన్ లో ఆడుతున్న సానియా.. నిన్ను మిస్ అవుతున్నాను. మళ్లీ కలుస్తానో లేదో.. కలిసేవరకు గుడ్ బై అంటూ పోస్ట్ చేసింది. ఆట మీకు ఎంతో ఇస్తుంది.
మానసికంగా.. శారీరకంగా.. భావోద్వేగపరంగా.. విజయాలు, ఓటములు. నిద్రలేని రాత్రులు.. కఠోర శ్రమ.. చేదు ఫలితాలు.. కన్నీళ్లు, సంతోషం.. పోరాటం, సవాళ్లు.. కానీ మిగతా ఏ ఉద్యోగం ఇవ్వలేని సంతృప్తి క్రీడల ద్వారా వస్తున్నందుకు నేను కృతజ్ఞురాలిని. వింబూల్డన్ ఒక అద్భుతం. గడిచిన 20 ఏండ్లుగా ఇక్కడ ఆడుతుండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మనం మళ్లీ కలిసేదాకా.. నేను నిన్ను మిస్ అవుతాన్నా అంటూ తన పోస్ట్ లో సానియా రాసుకొచ్చింది. సానియా వింబూల్డన్ ప్రయాణం 2001లో ప్రారంభమైంది. జూనియర్ స్థాయి నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2015 వింబూల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.
ఆ తర్వాత సానియా సెమీస్ కు చేరడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సానియా త్వరలోనే రిటైర్ కానున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. తల్లి అయిన తర్వాత ఫిట్ నెస్ సాధించి పునరాగమనం చేసినా సానియా మేజర్ టైటిల్స్ గెలుచుకోలేకపోయింది. సానియా మహిళల డబుల్స్ విభాగంలో వింబూల్డన్ తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గెలుచుకుంది. అలాగే మిక్సిడ్ డబుల్స్ లో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్స్ లో విజేతగా నిలిచింది.
Related News
Sania Mirza – MP Candidate : కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా ?
Sania Mirza – MP Candidate : ఈసారి ఎన్నికల్లో కనీసం 14 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నారు. ఈక్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంపీ స్థానాలను పెద్దసంఖ్యలో గెలుచు కునేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో ప్రజాదరణ, ప్రజల్లో స్టార్ ఇమేజ్ కలిగిన వారిని బరిలోకి దింపాలని రేవంత్ భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ స్టార్ బ్యాడ్మింటర్ ప�