WI Series : విండీస్ తో సీరీస్ కు భారత్ జట్టు ఇదే..
స్వదేశంలో వెస్ట్ ఇండీస్ తో జరగనున్న వన్డే, టీ ట్వంటీ సీరీస్ లకు భారత జట్టును ఎంపిక చేశారు. ఊహించినట్టుగానే సెలక్టర్లు పలు మార్పులు చేశారు.
- By Hashtag U Published Date - 10:47 AM, Thu - 27 January 22
స్వదేశంలో వెస్ట్ ఇండీస్ తో జరగనున్న వన్డే, టీ ట్వంటీ సీరీస్ లకు భారత జట్టును ఎంపిక చేశారు. ఊహించినట్టుగానే సెలక్టర్లు పలు మార్పులు చేశారు. పూర్తి ఫిట్ నెస్ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి వచ్చాడు. తొలిసారి పూర్తి స్థాయి సారథిగా టీమ్ ఇండియాను ఈ సీరీస్ నుంచే లీడ్ చేయబోతున్నాడు. యువ ఆటగాడు రవి బిష్ణోయ్ , దీపక్ హుడా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 21 ఏళ్ల లెగ్ స్పిన్ రవి బిష్ణోయ్ ఇప్పటివరకు 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల, బిష్ణోయ్ను లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. బిష్ణోయ్ 23 ఐపీఎల్ మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ చాలా రోజుల తర్వాత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంకకు వెళ్లిన భారత బి టీమ్లో చివరిసారిగా చోటు దక్కింది. అయితే ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు.అతని వన్డే, టీ20 రికార్డు అద్భుతంగా ఉండడంతో మరోసారి సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఈ లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ 65 వన్డేల్లో 107 వికెట్లు పడగొట్టాడు. టీ20లోనూ కుల్దీప్ 23 మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు.
ఇక దక్షిణాఫ్రికాలో పేలవ ప్రదర్శన కారణంగా భువనేశ్వర్ కుమార్ వన్డే జట్టు నుంచి తప్పించారు. అలాగే యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ కు కూడా అవకాశం దక్కలేదు. మరోవైపు శిఖర్ ధావన్ టీ20కి, ఇషాన్ కిషన్ వన్డే జట్టుకు దూరమయ్యారు. కాగా ఈ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు వైస్ కెప్టెన్ గా ఎంపికయిన కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. గాయం నుండి కోలుకొక పోవడంతో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్న హర్దిక్ పాండ్య కూడా విండీస్ తో సీరీస్ కు ఎంపికవలేదు. కాగా విండీస్ తో ఫిబ్రవరి 6 నుంచి వన్డే సీరీస్ జరగునుండగా ..ఫిబ్రవరి 16న టీ ట్వంటీ సీరీస్ మొదలు కానుంది. కరోనా ప్రభావంతో వన్డే సిరీస్ ను అహ్మదాబాద్ లోనూ , టీ ట్వంటీ సీరీస్ ను కోల్ కత్తా నిర్వహించనున్నారు.
Related News
RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ […]