IND vs AUS Final Match Umpires : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఐరన్ లెగ్ అంపైర్..ఏమవుతుందో అనే టెన్షన్లో ఫ్యాన్స్
2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచుల్లో టీమిండియా గెలవలేదు
- By Sudheer Published Date - 12:48 AM, Sat - 18 November 23
వరల్డ్ కప్ (World Cup 2023 ) చివరికి చేరింది..మరికొద్ది గంటల్లో వరల్డ్ కప్ 2023 విజేత ఎవరో తేలిపోతుంది. సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా (India) ఫైనల్ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ (IND vs AUS Final Match) జరగనుంది. ఈ మహా సంగ్రామాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అభిమానులు భారీ స్థాయిలో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే హోటళ్లు, పలు రెస్టారెంట్లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశాయి. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోడీ సైతం హాజరు కానున్నట్లు వినికిడి.
ఇదిలా ఉంటె ఈ మ్యాచ్కు సంబదించిన అంపైర్ల (Final Match Umpires) జాబితాను తాజాగా ఐసీసీ (ICC) ప్రకటించింది. ఈ ప్రకటన చూసి టీమ్ ఇండియా అభిమానులు ఖంగారుపడుతున్నారు. ఎందుకంటే ఐసీసీ ప్రకటించిన లిస్ట్ లో ఓ ఐరన్ లెగ్ అంపైర్ ఉండడం..ఏంజరుగుతుందో అనే ఆందోళన కలిగిస్తుంది. ఫైనల్ మ్యాచ్కు సీనియర్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇక థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే రిచర్డ్ కెటిల్ బరో (Richard Kettleborough Umpire) అంపైర్ గా చేసిన మ్యాచ్ లలో టీమ్ ఇండియా గెలవలేదు. దీంతో ఆ వ్యక్తి పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఒకటే ఆందోళన చెందుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచుల్లో టీమిండియా గెలవలేదు. ముఖ్యంగా అతడు అంపైరింగ్ చేసిన నాకౌట్, ఫైనల్ మ్యాచ్ల్లో గత 9 ఏళ్ల నుంచి భారత్ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. దీంతో నిన్నటివరకు అంత విజయం మనేది అనే ధీమా లో ఉండగా..ఇప్పుడు ఆ రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడని తెలిసి ఆందోళన చెందుతున్నారు.
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఇండియా ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో భారత్ ఇంటిదారి పట్టింది. 2016 టీ20 వరల్డ్కప్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్.. సెమీస్లో వెస్టిండీస్ చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్కూ కెటిల్ బరోనే అంపైర్గా ఉన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2021, 2023 ఫైనల్స్లోనూ భారత్ ఓటమి పాలైంది. ఈ రెండు ఫైనల్స్కు అతడు థర్డ్ అంపైర్గా వ్యవహరించాడు. ఇలా రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచ్ లన్ని టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఏంజరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. మరి టీమ్ ఇండియా సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా..? లేక ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిస్తుందా..? అనేది చూడాలి.
Read Also : Vijayashanthi : విజయశాంతి పార్టీ మారడానికి ఈటెలే కారణమా..?
Tags
Related News
T20 World Cup: టీమిండియాకు పట్టిన శని అంపైర్ మళ్లీ వచ్చేశాడు
అమెరికా, వెస్టిండీస్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్కు 26 మంది మ్యాచ్ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజులలో 9 వేర్వేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి.