World Athletics Championship: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన భారత్ నుంచి తొలి అథ్లెట్గా నీరజ్ రికార్డులకెక్కాడు.
- By Praveen Aluthuru Published Date - 06:40 AM, Mon - 28 August 23
World Athletics Championship: భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన భారత్ నుంచి తొలి అథ్లెట్గా నీరజ్ రికార్డులకెక్కాడు. ఫైనల్ మ్యాచ్లో నీరజ్ 88.17 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో నీరజ్ చోప్రా పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్తో గట్టిపోటీని ఎదుర్కొన్నాడు. అర్షద్ తన మూడవ ప్రయత్నంలో 87.82 మీటర్ల త్రోతో సత్తా చాటాడు. కానీ అతను నీరజ్ విసిరిన 88.17 మీటర్లను అధిగమించలేకపోయాడు.
ప్రపంచ ఛాంపియన్షిప్ క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ చోప్రా ప్రదర్శన అద్భుతంగా ఉంది. నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల జావెలిన్ విసిరి ఫైనల్కు చేరుకున్నాడు. అదే సమయంలో ఈ త్రో ఆధారంగా, నీరజ్ 2024 సంవత్సరంలో జరిగే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. పారిస్ ఒలింపిక్స్లో అర్హత మార్క్ 85.50 మీటర్లు, నీరజ్ దానిని సులభంగా దాటాడు.
2022లో నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. నీరజ్ త్రోను 88.13 మీటర్ల దూరంలో విసిరాడు, కానీ ప్రత్యర్థి ఆటగాడు 90 మీటర్ల త్రోను విసిరి బంగారు పతకాన్ని అందుకున్నాడు. నీరజ్ కెరీర్లో అత్యుత్తమ త్రో స్టాక్హోమ్లో జరిగిన డైమండ్ లీగ్లో సాధించాడు. 89.94 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
The moment Neeraj Chopra created history and became the first Indian to win Gold at World Athletics Championships.
Neeraj is India's pride…!! 🇮🇳 pic.twitter.com/OI9p97iCKa
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2023
Also Read: Mulugu Congress : ములుగులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
Related News
Gold- Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త.