Japan Open: ప్రీక్వార్టర్స్ లో శ్రీకాంత్…లక్ష్యసేన్, సైనా ఓటమి
జపాన్ ఓపెన్ తో భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి.
- By Naresh Kumar Published Date - 11:38 PM, Wed - 31 August 22
జపాన్ ఓపెన్ తో భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్స్ చేరుకోగా…
తొలి రౌండ్లోలక్ష్యసేన్, సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ 4 ఆటగాడికి షాకిచ్చాడు. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్.. ఈ గేమ్లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. లక్ష్యసేన్.. జపాన్కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో ఓడిపోయాడు. అలాగే మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 స్కోర్ తో ఓడిపోయింది. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లోనూ భారత్కు చుక్కెదురైంది.
పురుషుల డబుల్స్లో అర్జున్-కపిల జోడీ, మహిళల డబుల్స్లో జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం ఇంటిదారి పట్టింది. ఇక మిక్స్డ్ డబుల్స్లో ప్రసాద్-దేవాంగన్ జంట తొలి రౌండ్ లోనే ఓడిపోయింది. కాగా పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించాడు.
Related News
Saina Nehwal: ఒలింపిక్స్ నుంచి సైనా అవుట్ ?
పారిస్ ఒలింపిక్స్కు భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. ఆమె ఇప్పటికే గాయాలతో సతమతమవుతుంది.