IPL 2023: మైదానంలోకి అనుకోని అతిథి…మ్యాచ్ ఆడకుండా ఆగిపోయిన ధోనీ సేన…ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో
- By hashtagu Published Date - 08:06 PM, Mon - 3 April 23
చెన్నై వేదికగా (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన IPL మ్యాచ్ ఆలస్యమైంది. మైదానంలోకి అనుకోని అతిథి రావడం వల్ల మ్యాచ్ లేట్ గా ప్రారంభమైంది. చెపాక్ స్టేడియంలో ఒక కుక్క మైదానంలోకి ప్రవేశించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రౌండ్ సిబ్బంది కుక్కను పట్టుకుని గ్రౌండ్ నుంచి బయటకు పంపించేందుకు కొంత సమయం పట్టింది. ఈ కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇఫ్పుడా వీడియో ఇంటర్నెట్ వైరల్ గా మారింది. కుక్కను బయటకు పంపించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
#CSKvLSG #DogLover #CSK Even dog can not stop him to come #Chepauk pic.twitter.com/tOQDT9xble
— mohit (@Rajwar2Rajwar) April 3, 2023
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎల్ఎస్జి ప్లేయింగ్ ఎలెవన్లో జయదేవ్ ఉనద్కత్ స్థానంలో యశ్ ఠాకూర్ వచ్చాడు. సోమవారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో KL రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రెండవ మ్యాచ్లో MS ధోని మూడు సంవత్సరాల తర్వాత తిరిగి రానున్నారు. తమ మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోగా, ఎల్ఎస్జి ఢిల్లీ క్యాపిటల్స్పై 50 పరుగుల భారీ విజయంతో తమ ప్రచారాన్ని ప్రారంభించింది.
Related News
GT vs CSK: నేడు గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఓడిన జట్టు ఇంటికే, గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ 59వ లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.