DC Players List 2022: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉందో తెలుసా ?
బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు కొనసాగిన మెగా వేలంలో ఫ్రాంఛైజీలన్నీ కొత్త జట్లను తయారు చేసుకున్నాయి.
- By Naresh Kumar Published Date - 02:20 PM, Mon - 14 February 22
బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు కొనసాగిన మెగా వేలంలో ఫ్రాంఛైజీలన్నీ కొత్త జట్లను తయారు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా డబ్బులను ఉపయోగించడంలో బాగా విజయవంతమైందని చెప్పొచ్చు…ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలానికి ముందు రిషభ్ పంత్, ఆన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, పృథ్వీషాను రిటెయిన్ చేసుకుంది. ఈ మెగా వేలం కోసం రూ. 47.5 కోట్లను ఖర్చు పెట్టింది. ఈసారి వేలంలో తొలుత డేవిడ్ వార్నర్ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేయగా… శార్దూల్ ఠాకూర్ ను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది…
అలాగే మిచెల్ మార్ష్ను రూ. 6.50 కోట్లు, సయ్యద్ ఖలీల్ అహ్మద్ ను రూ. 5.25 కోట్లు, చేతన్ సకారియాను రూ. 4.20 కోట్లు, రోవ్మన్ పావెల్ను రూ. 2.80 కోట్లు, ముస్తాఫిజర్ రెహ్మాన్ ను రూ. 2 కోట్లు, కుల్దీప్ యాదవ్ ను రూ. 2 కోట్లు, కేఎస్ భరత్ను రూ. 2 కోట్లు, కమ్లేష్ నగర్కోటిను రూ. 1.10 కోట్లు, మన్దీప్ సింగ్ను రూ. 1.10 కోట్లు, లలిత్ యాదవ్ ను రూ. 65 లక్షలు, టిమ్ సీఫెర్ట్ ను రూ. 50 లక్షలు, యాష్ ధుల్ ను రూ. 50 లక్షలు, ప్రదీప్ దూబేను రూ. 50 లక్షలు, లుంగీ ఎంగిడిని రూ. 50 లక్షలు, అశ్విన్ హెబ్బర్, సర్ఫరాజ్ ఖాన్, రిపల్ పటేల్, విక్కీ ఓత్సవాల్ లను తలో రూ. 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. గత సీజన్ తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ ఢిల్లీ బలపడినట్టు చెప్పొచ్చు. మొత్తం మీద అనుభవం ఉన్న ఆటగాళ్లకు తోడు యువ క్రికెటర్లతో బలమయిన సైన్యం సిద్ధం చేసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ గా పంత్ మరోసారి ఆ జట్టును సమర్థవంతంగా లీడ్ చేస్తాడని ఢిల్లీ యాజమాన్యం ధీమాగా ఉంది.
Related News
IPL 2024: లక్నోపై ఢిల్లీ అద్భుత విజయం.. పూరన్, అర్షద్ ఖాన్ పోరాటం వృథా
ఐపీఎల్ 64వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్ను ఓడించింది. ఢిల్లీ సాధించిన ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ బాగా లాభపడింది. లక్నో ఓటమితో సంజూ శాంసన్ ఆర్మీ ప్లేఆఫ్ టికెట్ ఖాయం చేసుకుంది. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది.